క్రిసెంట్ సినిమా, టీఎస్ఆర్ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వింటర్’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Must Read

క్రిసెంట్ సినిమా, టీఎస్ఆర్ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వింటర్’. రామ్, ఆదిత్య సూరజ్ సింగ్, కుసుమ చందక, శశికళ, శ్రీజిత ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని రియాజ్ అహ్మద్, టి. శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ‘రాచరికం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సురేష్ లంకలపల్లి ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాతో రిజ్వాన్ అలీ విలన్‌గా తెరకు పరిచయం కానున్నారు. ఇక ఈ మూవీని కశ్మీర్ లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

‘వింటర్’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్ని ఇటీవలె ఘనంగా నిర్వహించారు. చిత్ర ప్రారంభోత్సవంలో టీం అంతా పాల్గొంది. సినిమా అద్భుతంగా రావాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని కోరుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, ఇతర టెక్నికల్ టీంకు సంబంధించిన వివరాల్ని ప్రకటించనున్నారు.

నటీనటులు : రామ్, ఆదిత్య సూరజ్ సింగ్ , కుసుమ చందక, శశికళ, శ్రీజిత గోష్, రిజ్వాన్ అలీ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్స్ : క్రిసెంట్ సినిమాస్, TSR మేకర్స్
నిర్మాతలు: రియాజ్ అహ్మద్, టి. శ్రీనివాస్ రావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ లంకలపల్లి
పీఆర్వో : సాయి సతీష్

Latest News

జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు ‘కన్నప్ప’

డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ‘కన్నప్ప’...

More News