శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో ‘ప్రాజెక్ట్ K’  

Must Read

శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచిన వైజయంతీ మూవీస్ ‘ప్రాజెక్ట్ K’    

వైజయంతీ మూవీస్ పాత్-బ్రేకింగ్ ప్రాజెక్ట్  ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించనుంది. ఈ యునిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాప్ కల్చర్ ఈవెంట్‌ సెలబ్రేట్ చేసుకోనుంది.  

అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో ప్రభాస్ పాత్రను క్యారికేచర్‌గా చూపించారు. పోస్టర్ లో ప్రత్యేక శక్తులతో సూపర్ హీరోగా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు .

వైజయంతీ మూవీస్ ఆకట్టుకునే సంభాషణలు, మరపురాని పెర్ఫార్మెన్స్ నిర్వహిస్తుంది. ఇండియన్ కల్చర్, సైన్స్ ఫిక్షన్ ప్రపంచం గురించి ఒక గ్లింప్స్ అందిస్తుంది.

ప్రత్యేక అతిథులు ఉలగనాయగన్ కమల్ హాసన్, సూపర్ స్టార్లు ప్రభాస్ , దీపికా పదుకొణె, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కూడిన ఎక్సయిటింగ్ ప్యానెల్‌తో SDCC వేడుక జూలై 20వ తేదీన ప్రారంభమవుతుంది.
 ఈ సందర్భంగా ప్రాజెక్ట్ K  క్రియేటర్స్ చిత్రం  టైటిల్, ట్రైలర్,  విడుదల తేదీని లాంచ్ చేస్తారు, కామిక్-కాన్ వేదికగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందజేస్తారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఇండియా చాలా గొప్ప కథలు, సూపర్ హీరోలకు నిలయం. మా చిత్రం దీనిని ప్రపంచానికి తెలియజేయడానికి, పంచుకోవడానికి చేసిన ప్రయత్నమని భావిస్తున్నాము.  కామిక్ కాన్ మా కథను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సరైన వేదికను అందిస్తుంది” ఆన్నారు.

నిర్మాత అశ్వనీ దత్ తన ఆనందం వ్యక్తం చేస్తూ, “భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా, ఈ అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా గర్వంగా ఉంది. మన దేశంలోని అతి పెద్ద సూపర్‌స్టార్‌లతో చేతులు కలుపుతూ, భారతీయ సినిమా సరిహద్దులను అధిగమించి మేము కొత్తగా అడుగు వేస్తున్నాం. వరల్డ్ మ్యాప్‌లో భారతీయ సినిమాను చూడాలని కోరుకునే భారతీయ ప్రేక్షకులందరికీ ఇది గర్వకారణమైన క్షణం. కామిక్ కాన్ మాకు వరల్డ్ స్టేజ్.”అన్నారు

ప్రాజెక్ట్ K  వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న మల్టీ లాంగ్వేజ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం, ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ తారాగణం, ప్రతి ఒక్కరు కీలకమైన పాత్రలను పోషిస్తూ ఎక్స్ టార్డీనరి చిత్రంగా మలచడంలో దోహదపడుతున్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News