‘తిరగబాదరసామి’. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్

Must Read

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ హైలెట్ గా నిలిచాయి. రాజ్ తరుణ్ యాక్షన్ మునుపెన్నుడూ కనిపించని యాక్షన్ అవతార్ లో అదరగొట్టారు. తన ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ హైలీ ఎనర్జిటిక్ గా వుంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా వున్నాయి.

డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి యాక్షన్, ఎమోషన్ ని ఎక్స్ ట్రార్డినరీ గా బ్లెండ్ చేశారు. ఆయన టేకింగ్ బ్రిలియంట్ గా వుంది. రాజ్ తరుణ్ ని యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో చాలా కొత్తగా చూపించారు. కెమరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. హై యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ తో అదరగొట్టిన ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి అందరం ప్రాణం పెట్టి చేశాం. మా అందరికి కంటే ఎక్కువ కష్టపడింది డీవోపీ జవహర్ రెడ్డి గారు. ఆయన లేకపోతే సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసిన నిర్మాత శివ గారికి థాంక్ యూ. జెబి గారు గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. మాల్వి వన్ అఫ్ ది బెస్ట్ యాక్టర్. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున థాంక్ యూ. డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన నాపై ఒక్కసారి కూడా కొప్పడలేదు. (నవ్వుతూ). ఇంత యాక్షన్ పార్ట్ చేయడం నాకు కొత్త. డైరెక్టర్ గారి ఎంకరేజ్మెంట్ తో ఈజీగా చేశాను. ఇందులో ఎమోషన్ , ఎంటర్ టైన్మెంట్ అద్భుతంగా వుంటుంది. ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. ‘తిరగబడరసామీ’ త్వరలోనే థియేటర్స్ లో వస్తుంది. దయచేసి అందరూ థియేటర్స్ లో చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు’ అన్నారు.

డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ గా వుంది. 2004 ఇదే రోజున యజ్ఞం విడుదలై నా జీవితాన్ని మలుపు తిప్పింది, అదే రోజున ఈ ట్రైలర్ రిలీజ్ కావడం చాలా ఆనందంగా వుంది. రాజ్ తరుణ్ కాబోయే మాస్ హీరో. ఈ సినిమా తర్వాత తను మాస్ హీరోగా నిలబడతాడు. డీవోపీ జోహార్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, జేబీ అద్భుతమైన మ్యూజిక్ చేశారు. శివకుమార్ గారు సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు.

మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది చాలా బ్యూటీఫుల్ కథ. ఇందులో చాలా మంచి పాత్ర చేశాను. ఇందులో బాలకృష్ణ ఫ్యాన్ గా కనిపిస్తా. నాకు యాక్షన్ సీన్ కూడా వుంది. ఈ సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది. రాజ్ తరుణ్ గారితో కలసి పని చేయడం చాలా అనందంగా వుంది. తను అద్భుతమైన యాక్టర్. అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారు కథ చెప్పిన వెంటనే చాలా నచ్చింది. రాజ్ తరుణ్ అయితే బావుటుందని వారు ఒప్పుకోగానే సినిమాని స్టార్ట్ చేశాం, జెబి అద్భుతంగా నేపధ్య సంగీతం చేశారు. జవహర్ రెడ్డి గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. నేను ప్రతి సినిమాలో కొత్తవారిని పరిచయం చేస్తుంటాను. మాల్వి ఈ సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ అవుతున్నారు. ఈ పాత్రని చాలా చక్కగా చేశారు. మంచి సినిమాని ప్రేక్షకులకు అందిఇవ్వాలని టీం అంతా సమిష్టి కృషితో పని చేశాం. రాజ్ తరుణ్ యాక్షన్ పాత్రలో చాలా కొత్తగా కనిపిస్తారు. సైలెంట్ గా మొదలై వైలెంట్ ముగింపు వుంటుంది. ఈ నెలలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇది మా బ్యానర్ లో రికార్డ్ లో నిలిచిపోయే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

తారాగణం: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
సంగీతం: జెబి &భోలే షావలి
డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్
ఎడిటర్: బస్వా పైడిరెడ్డి
ఆర్ట్: రవికుమార్ గుర్రం
ఫైట్స్ – పృద్వీ, కార్తీక్
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి
పీఆర్వో: వంశీ శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News