కొత్త పాయింట్‌తో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. దర్శకుడు మారుతి

Must Read

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు.

‘స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి.. ఇది నువ్వో నేనో చేసే పని కాదు దిమాక్ ఉన్నోడే చేయాలి.. ఒకడు తాచు పాము తోకని తొక్కాడు.. తొక్కిన వాడ్ని పాము కాటేయబోతోంది.. మరి తొక్కించిన వాడి సంగతేంటి?’.. అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో సాగిన ఈ టీజర్‌లో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. టీజర్‌లో సత్యరాజ్, వశిష్ట, సత్యం రాజేష్ ఇలా చాలా పాత్రలకు ఉన్న ఇంపార్టెన్స్‌ను చూపించారు. ఇక టీజర్ చివర్లో వదిలిన షాట్స్, చూపించిన గెటప్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. టీజర్ రిలీజ్ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..

స్టార్ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘బార్బరిక్ సినిమా కోసం నేనేమీ పని చేయలేదు. ఈ టీంకు సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చాను. ఇది చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. మోహన్, రాజేష్ చాలా కాన్ఫిడెన్స్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. విజయ్ గారు ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. విజయ్ గారు అతి తక్కువ టైంలోనే పెద్ద ప్రొడ్యూసర్ కానున్నారు. విజయ్ గారితో కలిసి జీతెలుగుతో మరో సినిమాను చేయబోతున్నాను. మోహన్ లోపలకి బార్బరికుడు వెళ్లిపోయాడు. మోహన్‌లో చాలా ఎనర్జీ ఉంది. ఈ మూవీని చాలా చక్కగా తీశారు. రమేష్ రెడ్డి గారి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ఇంఫ్యూజన్ బ్యాండ్‌ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రజెంట్ జనరేషన్‌కి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. సత్య రాజ్ గారు బాహుబలి చేశారు.. బార్బరిక్ కూడా చేశారు. ఆయనకు కథ నచ్చితే వెంటనే ఓకే చెబుతారు. ఆయనతో నేను ప్రతిరోజూ పండగే వంటి మంచి సినిమాను చేశాను. ఈ మూవీని అందరూ ఎంకరేజ్ చేయాలి’ అని అన్నారు.

సత్య రాజ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టీంకు ఇక ప్రతి రోజూ పండుగే. ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇకపై మేం అంతా రాజా సాబ్‌లమే. డైరెక్టర్ మోహన్ నాకు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాకు కథే హీరో. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి, రాజేష్ గారు టీంను చక్కగా చూసుకున్నారు. సత్యం రాజేష్ గారు సినిమాలో నాతో పాటే ఉంటారు. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్ వస్తుంది. నన్ను తెలుగులో డబ్బింగ్ చెప్పమని అన్నారు. హిందీ, కన్నడ, తమిళంలోనూ డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.

నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల మాట్లాడుతూ.. ‘వానర సెల్యూలాయిడ్ అనేది మా తల్లిదండ్రుల పేరు మీదుగా పెట్టాను. మారుతి గారితో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆయనకు ఎప్పుడూ రుణ పడి ఉంటాను. బార్బరిక్ లాంటి పెద్ద సినిమాను చేస్తానని నేను అనుకోలేదు. ఈ మూవీ కోసం ఇంఫ్యూజన్ బాండ్‌ను తీసుకొచ్చాను. సినిమా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు.

దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. సత్యం సుందరం సినిమాను చూస్తే.. సుందరం లాంటి ఇద్దరు వ్యక్తులు ఈ స్టేజ్ మీదున్నారు. విజయ్ గారు నేను చెప్పిన కంటెంట్, కథను నమ్మి నాకు కావాల్సినంత బడ్జెట్ ఇచ్చారు. మారుతి గారు నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ స్పూర్తినింపుతూనే ఉన్నారు. సత్యరాజ్ ఈ పాత్రను చాలా ప్రేమించారు. అర్దరాత్రి దాటినా షూటింగ్ చేస్తూ ఉండేవారు. వర్షంలోనే రాత్రి పూట షూటింగ్ చేస్తుండేవారు. సత్యం రాజేష్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వశిష్ట త్వరలోనే స్టార్ అయిపోతారు. సాంచీ చాలా మంచి అమ్మాయి. క్రాంతి కిరణ్ మంచి స్టార్ అయిపోతాడు. బార్బరికుడికి త్రిబాణాస్త్రం ఉన్నట్టు నాకు మూడు అస్త్రాలున్నాయి. ఒకటి డీఓపీ రమేష్, రెండు ఫ్యూజన్ బాండ్, మూడు ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్. ఈ మూడు అస్త్రాలతో నేను ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను’ అని అన్నారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ చిత్రం చాలా బాగుంటుంది. నాకు మంచి పాత్ర వచ్చింది. దీని మీద ఎంత బడ్జెట్ పెట్టారో కూడా ఊహించలేరు. మినీ బాహుబలిలా ఉంటుంది. వశిష్ట, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, యష్న అద్భుతంగా నటించారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజేష్ అందరికీ సపోర్ట్‌గా నిలిచారు. సత్యరాజ్ గారు ఏ ఏజ్ యాక్టర్‌లతో నటిస్తే ఆ ఏజ్ యాక్టర్‌లా మారిపోతారు. ఆయనతో నటించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

హీరోయిన్ సాంచి రాయ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టీజర్ అందరికీ నచ్చుతుంది. ఇది నాకు ఫస్ట్ తెలుగు సినిమా. నాకు ఇక్కడ అనంతమైన ప్రేమ లభిస్తుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.

నటుడు క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. ఇందులో నేను దేవ్ అనే పాత్రను పోషించాను. కొత్త దర్శక, నిర్మాతలకు మారుతి గారు బ్యాక్ బోన్‌లా నిలిచారు. కంటెంట్‌తో వస్తున్న సినిమా ఇది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. మున్ముందు మరిన్ని అప్డేట్లతో రాబోతున్నామ’ని అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ.. ‘త్రిబాణధారి బార్బరిక్ టీజర్ అద్భుతంగా ఉంది. మారుతి గారు మాకు పరిచయమైన దగ్గర్నుంచి ఆయన సినిమా ఆడియో మా ద్వారానే రిలీజ్ అవుతున్నాయి. ఇంఫ్యూజన్ బ్యాండ్ మంచి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

తారాగణం: సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర

సాంకేతిక బృందం

బ్యానర్ : వానర సెల్యూలాయిడ్
రచన & దర్శకత్వం : మోహన్ శ్రీవత్స
నిర్మాత : విజయపాల్ రెడ్డి అడిదల
సమర్పణ : మారుతీ టీమ్ ప్రోడక్ట్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాజేష్
లైన్ ప్రొడ్యూసర్ : సురేష్
డీఓపీ : కుశేందర్ రమేష్ రెడ్డి
సంగీతం : ఇన్ఫ్యూజన్ బ్యాండ్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ పున్నాస్
ఫైట్స్ : రామ్ సుంకర
కాస్ట్యూమ్ డిజైనర్ : మహి డేరంగుల
PRO : సాయి సతీష్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News