‘రేవు’ సినిమాలో కూడా అంతే ప్రామిసింగ్ కంటెంట్ ఉంది..

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు మూవీ యూనిట్.

రేవు ప్రెస్ మీట్‌లో నిర్మాత మురళి గింజుపల్లి మాట్లాడుతూ.. పిలవగానే ఈ ఈవెంట్ కు వచ్చిన పాత్రికేయ కుటుంబానికి ధన్యవాదాలు. ఇప్పటికే ట్రైలర్, మూడు అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇంకో పాట కూడా ఉంది. అది త్వరలోనే వస్తుంది. సినిమా రిలీజయ్యాక ఆ పాట చూసి మరింత ఎగ్జైట్ ఫీల్ అవుతారు అని అన్నారు.

హరినాథ్ పులి.. థ్యాంక్స్ టు తెలుగు మీడియా. ప్రతి ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఎలివేట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. సాంగ్స్, ట్రైలర్స్ లో ఎంత ప్రామిసింగ్ కంటెంట్ ఉందో సినిమాలో కూడా అంతే ప్రామిసింగ్ కంటెంట్ ఉంది. రేవు సినిమా ఆగస్టు 23న రిలీజ్ కానుంది. థియేటర్లో ఈ సినిమాని చూడండి అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. నా పాత్రికేయ కుటుంబానికి స్వాగతం. రేవు సినిమాని ఆగస్టు 23న తీసుకురాబోతున్నాం. ఎప్పుడో సంవత్సరం క్రితం నేను ఒక అయిదు నిమిషాల ట్రైలర్ చూసాక ప్రేక్షకులకు నచ్చుతుంది ఈ సినిమా అనే కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఆ తర్వాత రాంబాబు గారు సినిమా చూసారు. మేమిద్దరం కలిసి మిత్రులు, NRI, నిర్మాత మురళి గారికి ఈ సినిమా చూపిస్తే వెంటనే ఈ సినిమాని నేను చేస్తాను, రిలీజ్ చేస్తాను అని చెప్పారు. అంతకుముందు డైరెక్టర్ హరినాథ్ పులి, మిగిలిన టీమ్ అంతా కలిసి డబ్బులు పోగేసుకొని ఈ సినిమాని ఒక దశకు తీసుకువచ్చాక మేము ఈ సినిమాలోకి వచ్చాము. నిర్మాణ పర్యవేక్షణ నేను చేస్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాంబాబు చేస్తూ ఈ సినిమాని తీసుకొస్తున్నాము. ఈ సినిమాకి మంచి రెస్పాండ్ వస్తుంది. రేవు సినిమాకి మొదట ఒక కర్టెన్ రైజర్ ఈవెంట్ పెడితే ఆ సినిమాకు మురళీమోహన్ గారు, ఆర్జీవీ గారు రావడం, అది క్రేజీ ఈవెంట్ గా మారింది. ఆ తర్వాత ఇదే వేదికపై ఆడియో ఈవెంట్ చేసి అయిదుగురు అగ్రశ్రేణి గీత రచయితలను ఆహ్వానించి కొత్తగా చేసాము. ప్రతి ఈవెంట్ కు మంచి రెస్పాండ్ వస్తుంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే 23న సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలుగుతుంది అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. ఇక్కడున్న వాళ్లంతా నా పాత్రికేయ మిత్రులే. హరినాథ్ పులి చేసిన ఈ రేవు సినిమా, అతని టేకింగ్ చూసాక రాంబాబు గారితో మాట్లాడి మా ఫ్రెండ్స్ అయిన మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి లకు చెప్పి ఈ సినిమాను ఈ స్టేజి వరకు తీసుకొచ్చాము. 23న సినిమా రిలీజ్ అయ్యాక అందరితో పర్సనల్ గా మాట్లాడతాను అని తెలిపారు.

Tfja Team

Recent Posts

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

4 days ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

5 days ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

5 days ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

5 days ago

సావిత్రి గారంటే తెలుగుతనం, అమ్మతనం ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…

5 days ago

‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్*

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…

6 days ago