–ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు కొండల్
“కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా “అదే నీవు అదే నేను”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందించారు. “అదే నీవు అదే నేను” సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంపై మూవీ నిర్మాత గోవిందు కాండ్రేగుల, చిత్ర దర్శకుడు కొండల్, ఇతర టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
దర్శకుడు కొండల్ మాట్లాడుతూ – మా “అదే నీవు అదే నేను” సినిమా జూలై 31న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. చూసిన వాళ్లంతా మూవీ అద్భుతంగా ఉంది, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉందని చెబుతున్నారు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉందని, ఇలాంటి స్క్రీన్ ప్లే తాము చూడలేదని ప్రేక్షకులు చెబుతుండటం సంతోషంగా ఉంది. సినిమా ఫస్టాఫ్ లో మనకు కలిగే అపార్థాలు తొలగిపోయేలా సెకండాఫ్ లో మన వివాహ వ్యవస్థ గొప్పదనం చెప్పడం ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. గేటెడ్ కమ్యూనిటీలో ఆరు ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రమిది. ఒక్క పోలీస్ పాత్ర లేకుండా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేయడమే ఒక ప్రయోగం. మా సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమాను మరింతగా ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీకు సినిమా నచ్చితే మరో 20 మందికి చెప్పండి. మాలాంటి కొత్త దర్శకులను, టీమ్ ను ఎంకరేజ్ చేయండి. అన్నారు.
నటీనటులు – త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్, తదితరులు
ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
లిరిక్స్ – పూర్ణాచారి
డైలాగ్స్ – వై.అమ్మిరాజు
డీవోపీ – నిమ్మల జయపాల్ రెడ్డి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
మ్యూజిక్ – కనిష్క
ప్రొడ్యూసర్ – కాండ్రేగుల గోవిందు
స్క్రిప్ట్, డైరెక్షన్ – కొండల్
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…
-త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో…
విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ 'కాళాంకి భైరవుడు' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ…
ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ పై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.…
తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ…
▪️ తెలుగు, కన్నడ భాషల్లో జూన్లో విడుదలైన చిత్రం▪️ 300 థియేటర్లలో విడుదలై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల…