నెక్ట్స్ లెవల్ మ్యూజిక్ ఇదే..
▪️ M4M మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ఇసైపెట్టైపై మోహన్ వడ్లపట్ల ప్రశంసలు
మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో వంటి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’). సంబీత్ ఆచార్య, జో శర్మ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మ్యూజిక్పై స్పెషల్ వీడియో చేశారు మోహన్ వడ్లపట్ల. వసంత్ ఇసైపెట్టై అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉందన్నారు. ఇలాంటి ట్యూన్స్ ఇప్పటి వరకు చూసి ఉండరని చెప్పారు.
ఈ సందర్భంగా తనకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మోహన్ వడ్లపట్లకు మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ఇసైపెట్టై కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రయత్నానికి సహకరించినందుకు రుణపడి ఉంటానని చెప్పారు. ఈ సినిమా మ్యూజిక్ లవర్స్ని బాగా నచ్చుతుందని తెలిపారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలం.. ఇలా ఐదు భాషలలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఐదు భాషలలో రిలీజ్ అయిన టీజర్స్కు ఇసైపెటై ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుని అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం వసంత్ ఇసైపెట్టై నేతృత్వంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తుది మెరుగులు దిద్దుకుంటోంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’) ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఒడిశా సూపర్ స్టార్ సంభీత్ ఆచార్య, అమెరికన్ యాక్ట్రస్ జోశర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది.
Hero/Heroine : జో శర్మ (USA), సంబీత్ ఆచార్య
సాంకేతిక బృందం:
బ్యానర్ : మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్
కథ : మోహన్ వడ్లపట్ల, జో శర్మ, రాహుల్ అడబాల
దర్శకత్వం : మోహన్ వడ్లపట్ల
సంగీతం : వసంత్ ఇసైపెట్టై
కెమెరామెన్ : సంతోష్
ఎడిటింగ్ : పవన్ ఆనంద్
పీఆర్వో : పర్వతనేని రాంబాబు, కడలి రాంబాబు, దయ్యాల అశోక్
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…
"టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026" జ్యూరీ ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ వ్యవహరిస్తారు: టీఎఫ్…
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక…