కాలి గాయంపై స్పందించిన హీరోయిన్ రశ్మిక మందన్న, గాయాలు చికాకు తెప్పిస్తాయని ఇన్ స్టా పోస్ట్

ఇటీవల మైసా సినిమాలో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా తీవ్రంగా గాయపడింది హీరోయిన్ రశ్మిక మందన్న. ఆమె 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు రశ్మిక బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆమె తాజాగా తన కాలి గాయంపై స్పందించారు. ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ లో రశ్మిక మందన్న స్పందిస్తూ – గాయాలు అవ్వడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ గాయం గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నా కానీ తెలిసిపోయింది. నాకు ఇలాంటి గాయం కావడం ఇది మూడవసారి. తుంటికి కాలుని కలిపే టెండన్స్ ఒక్కో వైపు నాలుగు ఉంటాయి. నా కుడి తుంటిలోని ఒక టెండెన్ ఊడిపోయింది. నేను కాలు పైకి ఎత్తాలి అంటే అది మళ్లీ అతుక్కోవాలి. మైసా సినిమా కోసం డాన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నేను చేస్తున్న సినిమాల్లో మైసా అత్యంత కష్టమైన సినిమా. నేను విశ్రాంతి తీసుకోవడానికే దేవుడు ఈ గాయం బారిన పడేలా చేశాడని భావిస్తున్నాను. అని అన్నారు.

ప్రస్తుతం రశ్మిక రణబాలి, మైసా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వీటితో పాటు మరో రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే 30 ప్రాడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రశ్మికకు అయిన తీవ్ర గాయంతో ఆయా సినిమాల, వ్యాపార ప్రకటనల షూటింగ్స్ నిలిచిపోయాయి.

TFJA

Recent Posts

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

23 hours ago

కోకాపేటలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఏపీ గ్రీన్ ఛైర్మన్ & ఎమ్మెల్సీ కొణిదల నాగేంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్…

2 days ago

గబ్బర్ సింగ్ రమేష్‌కు మెగా కుటుంబం అండ — చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో గబ్బర్ సింగ్ టీమ్

మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను గబ్బర్ సింగ్ టీమ్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి గారి నివాసంలో…

2 days ago

సూపర్ హిట్ టాక్, భారీ బుకింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న నివిన్ పాలీ “బెత్లెహెం కుడుంబ యూనిట్” సినిమా

మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బెత్లెహెం…

2 days ago

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌తొలివారంలో 5 కోట్ల 27 లక్షల గ్రాస్‌ సాధించిన హుషార్‌ పిట్టలు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషార్‌ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

2 days ago