ఖుషి’ సినిమా నుండి ఐదో పాట ‘ఓసి పెళ్లామా..’ రిలీజ్

Must Read

ఖుషి’ సినిమా నుండి ఐదో పాట ‘ఓసి పెళ్లామా..’ రిలీజ్

Osi Pellama - Lyrical | Kushi | Vijay Deverakonda, Samantha | Hesham Abdul Wahab | Shiva Nirvana

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి ఐదో లిరికల్ పాట ‘ఓసి పెళ్లామా..’ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ పబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యెర్నేని, మైత్రీ సీయీవో చెర్రీ, దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు.

పబ్ లో పార్టీ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు. ‘ఓసి పెళ్లామా..’ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ రాయగా…హేషమ్ అబ్దుల్ వాహాబ్ మరోసారి క్యాచీ ట్యూన్ అందించారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ పాడారు. కాశ్మీర్ లో ఫస్ట్ టైమ్ తనను చూసిన, ముందెనక చూడకుండ మనసిచ్చిన…బాబు మాట పక్కనెట్టి బయటకొచ్చిన, లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసిన…అంటూ హీరో తన ప్రేమ, పెళ్లి ప్లాష్ బ్యాక్ గురించి చెబుతూ సాగుతుందీ పాట. ఈ పాట విడుదల కార్యక్రమంలో

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ – ఈ సాంగ్ రిలీజ్ లో పాల్గొనేందుకు వచ్చిన అందరికీ వెల్ కమ్. ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన మైత్రీ రవి గారికి, సంగీత దర్శకుడు హేషమ్ గారికి, డైరెక్టర్ శివ గారికి థాంక్స్. ఫస్ట్ టైమ్ విజయ్ అన్నకు నేను పాడిన పాట ఇది. బ్యూటిఫుల్ సాంగ్ ఇది. మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ – మిగతా అందరి కంటే ప్రొడ్యూసర్స్ గా మేము ఈ సినిమా కోసం ఉత్సాహంగా వేచి చూస్తున్నాం. సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఖుషి మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. అన్నారు

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – నా సినిమా థియేటర్ లో రిలీజై రెండేళ్లు దాటుతోంది. మళ్లీ మీ అందరినీ ఓ మంచి ఎంటర్ టైనర్ తో కలుస్తుండటం సంతోషంగా ఉంది. ఖుషిలో మంచి ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూడొచ్చు. మీరు రీపీటెడ్ గా సినిమాను చూస్తారు. అంత బాగుంటుంది. ఫన్ రైడ్ లా సినిమా ఉంటుంది. చాలా రోజుల తర్వాత సమంత లవ్ స్టోరీలో నటిస్తుందంటే మనందరికీ పండగ. ఇవాళ ఈ స్టేజీ మీద విజయ్ ను, సమంతను మిస్ అవుతున్నా. హేషమ్ బ్రో మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన రవి గారికి, నవీన్ గారికి థాంక్స్. అన్నారు.

సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ మాట్లాడుతూ – ఖుషి సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చేందుకు మైత్రీ సంస్థ , డైరెక్టర్ శివ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ నెల ఒకటో తేదీన మేము ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేశాం. ఇవాళ కంప్లీట్ చేశాం. ఈ సినిమాకు పనిచేసేందుకు ఎంతో సపోర్ట్ చేశారు మైత్రీ ప్రొడ్యూసర్స్. ఖుషి థియేటర్ లో బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇస్తుంది. తప్పకుండా చూడండి. అన్నారు.

మైత్రీ సీయీవో చెర్రీ మాట్లాడుతూ – ఎన్నో జానర్స్ మూవీస్ చూస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్య ఒక ఫుల్ ప్లెజ్డ్ లవ్ స్టోరీ రాలేదు. ఖుషిలో అలాంటి మంచి ప్రేమ కథను అన్ని ఎమోషన్స్ కలిపి చూస్తారు. దర్శకుడు శివ గారు మంచి సినిమా చేశారు. సెప్టెంబర్ 1న ఖుషిని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News