‘క్రేజీ ఫెలో’ ను ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన   యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో.  దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో శర్వానంద్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ప్రీరిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.. ఆది నాకు బ్రదర్ లాంటి వాడు. తనని తమ్ముడిలానే చూస్తాను. తనకి సక్సెస్ వస్తే నేను ఎంజాయ్ చేస్తాను. క్రేజీ ఫెలోలో రన్ రాజా రన్ ఫ్లేవర్ కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్ టైనర్ అనిపిస్తోంది.  క్రేజీ ఫెలో పెద్ద సక్సెస్ కావాలి. రాధ మోహన్ గారు నాకు పదేళ్ళుగా పరిచయం. పాటలు చాలా బావున్నాయి. దర్శకుడు ఫణి కృష్ణ టేకింగ్ బావుంది. మాటల్లో మంచి కామెడీ టైమింగ్ వుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ బెస్ట్ విశేష్. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. అందరూ థియేటర్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.

ఆది సాయికుమార్  మాట్లాడుతూ..  ఈ ఈవెంట్ కి వచ్చిన శర్వానంద్ అన్నకి కృతజ్ఞతలు. మారుతి, సంపత్ నంది గారికి థాంక్స్. క్రేజీ ఫెలో హిలేరియస్ ఎంటర్ టైనర్. మంచి ఎమోషన్ కూడా వుంటుంది. కథని బలంగా నమ్మి చేశాం. దర్శకుడు ఫణి కృష్ణ చాలా అద్భుతమైన కథని రెడీ చేశారు. నిర్మాత రాధామోహన్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. ద్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సతీష్ ముత్యాల గారు వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో చేసిన మిర్నా, అనీష్, రమేష్, సప్తగిరి .  అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అక్టోబర్ 14న సినిమా థియేటర్ లోకి వస్తుంది. ప్రేక్షకులు థియేటర్ లో చూసి ఆదరించాలి” అని కోరారు.సంపత్ నంది మాట్లాడుతూ.. రాధమోహన్ గారి శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నా హోం బ్యానర్ లాంటింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ తొలి సినిమా చేస్తున్న దర్శకులకు లక్కీ బ్యానర్.  ఏమైయింది ఈవేళ తో నాకు మంచి విజయం ఇచ్చారు. ఈ సినిమాతో ఫణి కృష్ణ కూడా మంచి విజయం దక్కుతుంది. రాధకృష్ణ గారు ప్యాషన్ తో సినిమా చేసే నిర్మాత. క్రేజీ ఫెలో లో మంచి మ్యూజిక్ వుంది. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశారు. అక్టోబర్ 14న అందరూ సినిమా ఆదరిస్తారని కోరుతున్నాను.

నిర్మాత రాధమోహన్ మాట్లాడుతూ.. మేము కోరగానే ఈ వేడుకుకు వచ్చిన శర్వానంద్, సంపత్ నంది, మారుతి గారికి కృతజ్ఞతలు. దర్శకుడు ఫణి కృష్ణ చెప్పిన కథ నచ్చింది. ఈ కథకి ఆది చక్కగా సరిపోయాడు. మిర్నా ఈ సినిమాతో తెలుగులో అడుగుపెడుతోంది. ఈ సినిమా కోసం మంచి టీమ్ వర్క్ చేశాం. ద్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు ఫణి కృష్ణ కి మంచి భవిష్యత్ వుంది. తను ఏం చెప్పాడో అదే తీశారు. క్రేజీ ఫెలో మంచి ఎంటర్ టైనర్. అక్టోబర్ 14న సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి”  అని కోరారు.చిత్ర దర్శకుడు ఫణి కృష్ణ మాట్లాడుతూ..నేను చెప్పిన కథ నచ్చి, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత రాధామోహన్ గారికి కృతజ్ఞతలు. అక్టోబర్ 14న ఆయన నమ్మకం నిలబెట్టుకుంటాను. అది గారు ఈ సినిమాలో కొత్తగా వుంటారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించింది. ఈ సినిమా కోసం చాలా క్రేజీగా పని చేశాం. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు.మిర్నా మీనన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. అది గారితో పని చేయడం ఆనందంగా వుంది.

ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. అక్టోబర్ 14న థియేటర్లో సినిమా చూసి మమ్మల్ని ప్రోత్సహించండి” అని కోరారు.దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో పాటలు చాలా ఎనర్జిటిక్ గా వున్నాయి. అది చాలా అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. నిర్మాత రాధ మోహన్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తీశారు. సినిమాలో కూడా కొత్త కాన్సెప్ట్ ఉంటుందని భావిస్తున్నాను. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి” అని కోరారుద్రువన్ మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో క్రేజీ మెమొరీలా వుండిపోతుంది. నిర్మాత రాధామోహన్ గారికి, దర్శకుడు ఫణి కృష్ణ కి కృతజ్ఞతలు. ఆది గారి కెరీల్ ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ విజయం అవుతుంది” అన్నారుఈ వేడుకలో కాసర్ల శ్యామ్, యాక్షన్ కోరియోగ్రఫర్ రామకృష్ణ,  అనీష్ కురివిల్లా,  వినోదిని వైద్యనాధన్ తదితరులు  పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం.. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.. ‘సన్ ఆఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత, హీరో సాయి సింహాద్రి

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…

55 minutes ago

‘హేబల్‌వంత్‌’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది: థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌లో వెల్లడించిన చిత్ర నిర్మాత

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

3 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

1 day ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

3 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago