‘ప్రణయ గోదారి’ చిత్రానికి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, సక్సెస్ మీట్‌లో విఘ్నేశ్

సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ప్రణయ గోదారి’ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ అయింది. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు, మీడియాకు థాంక్స్ చెప్పేందుకు ప్రణయగోదారి టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

దర్శకుడు విఘ్నేశ్ మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రమైనా పెద్ద హిట్ అందించిన ఆడియెన్స్, మీడియాకి థాంక్స్. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ టీంను అభినందించారు. విజువల్స్, పాటలు ఇలా ప్రతీ దాని గురించి మాట్లాడారు. కొత్త టీం అయినా చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. ఆడియెన్స్ ఫీడ్ బ్యాక్ విని మాకు చాలా ఆనందమేసింది. ప్రేక్షకులు బాగానే ఉందని అన్నారు.. కానీ మీడియా వారు ఎలాంటి రివ్యూలు ఇస్తారో అని అనుకున్నాం. మీడియా కూడా మా మూవీని మెచ్చుకుంది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మా సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సదన్ గారు సెట్‌లో మా అందరినీ నవ్విస్తూ ఉంటారు. సాయి కుమార్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాకు ఇంత ప్రేమను ఇస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’అని అన్నారు

సంగీత దర్శకుడు మార్కండేయ మాట్లాడుతూ.. ‘మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తున్నారు. మా సినిమా జనాల్లోకి తీసుకెళ్లడంలో మీడియా ముఖ్య పాత్రను పోషించింది. నేను ఇచ్చిన పాటలను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

నటుడు సునీల్ రావినూతల మాట్లాడుతూ.. ‘మా సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా రోజుల తరువాత అందమైన ప్రేమ కథా చిత్రాన్ని చూశామని అంటున్నారు. కథకు తగ్గ విజువల్స్, పాటలు ఉన్నాయని అన్నారు. మార్కండేయ గారి పాటల్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మా చిత్రానికి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

నటి ఉషా శ్రీ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి చిత్రాన్ని ఆడియెన్స్ ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా ఇంకా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

కెమెరామెన్ ప్రసాద్ ఈదర మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి చిత్రానికి కెమెరామెన్‌గా పని చేసినందుకు ఆనందంగా ఉంది. మా చిత్రానికి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ కళాధర్ మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి చిత్రంలో పాటల పిక్చరైజేషన్ బాగుందని అంతా చెబుతున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తోంది. కెమెరామెన్‌ గారు అందంగా తీశారు. నటీనటులు అందంగా నటించారు. మీడియా వల్లే మా సినిమాకు ఇంత ఆదరణ లభిస్తోంది’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

‘GS (గాడ్స్ అండ్ సోల్జర్స్)’ షూటింగ్ పూర్తి – శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్‌

రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ ప్రధాన చిత్రీకరణ పూర్తైంది.…

8 hours ago

ఈ సమ్మర్ లో రెండు ప్రెస్టీజియస్ మూవీస్ “స్వయంభు”, “నాగబంధం”తో ప్రేక్షకుల ముందుకొస్తున్న హీరోయిన్ నభా నటేష్

బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ కు ఈ సమ్మర్ ఎంతో స్పెషల్ గా ఉండబోతోంది. ఆమె నటించిన రెండు…

9 hours ago

ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

10 hours ago

హేబల్‌వంత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లు ఊగిపోతున్నాయి: సక్సెస్‌మీట్‌లో చిత్ర యూనిట్‌

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

1 day ago

‘హే బల్‌వంత్’తో కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నాం.. రిలీజ్ ప్రెస్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత వంశీ నందిపాటి

‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా…

2 days ago

“ప్రభాస్ నిమ్మలతో కలిసి”మిరాకిల్” చేద్దాం రండి” అంటున్నహీరోయిన్ హెబ్బా పటేల్!!

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

2 days ago