‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌2’ని ప్రారంభించిన ఆహా

Must Read

హైదరాబాద్‌, మార్చి 3: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైంది. ఆహాలో తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానుంది. రియాలిటీ షోలలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకుని, పాపులర్‌ అయిన షో తెలుగు ఇండియన్‌ ఐడల్‌. సుమధురమైన గళాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సొంతం. హార్ట్ టచింగ్‌ పెర్ఫార్మెన్స్ లు, హృద్యంగా సాగిన పాటలతో ప్రేక్షకులను వినోదింపజేసింది ఆహా.

ఈ క్రమంలో, అదనపు హంగులు సమకూర్చడంలో భాగంగా సింగిల్‌ మారథాన్‌ను ఏర్పాటు చేసింది తెలుగువారి అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా. ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఈ మారథాన్‌కి విశేషమైన స్పందన వచ్చింది. దాదాపు ఐదు గంటల పాటు టాలీవుడ్‌ గురు రామాచారి ఆధ్వర్యంలో ఈ మారథాన్ జరిగింది‌. ఆయనతో పాటు ఆయన లిటిల్‌ మ్యూజీషియన్స్ అకాడెమీ సింగర్స్ కూడా పాల్గొన్నారు.

ఆహుతులను అమితంగా ఆకట్టుకున్న కార్యక్రమంగా పేరు తెచ్చుకుంది‌. యువ గాయనీగాయకుల్లో ఉన్న ప్రతిభ, కళ పట్ల వారుచూపించే అంకిత భావం సభికులను అలరింపజేశాయి. పసిపిల్లల్ని, పాముల్నీ సైతం కదిలింపజేసే శక్తి సంగీతానికుంది. ఆ శక్తిని ప్రత్యక్షంగా ఆస్వాదించి, అనుభూతి చెందే అదృష్టం ఆ ప్రాంగణానికి హాజరైన సభికులకు కలిగింది.

గ్రాండ్‌ లాంచ్‌ ఈవెంట్‌ గురించి, గురు రామాచారి మాట్లాడుతూ”సంగీత ప్రపంచంలో గేమ్‌ చేంజర్‌గా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ ప్రోగ్రామ్‌కి పేరుంది. ఫస్ట్ సీజన్‌లో అద్భుతమైన గళాలను ఆస్వాదించగలిగాం. ఈ షోతో అసోసియేట్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ సీజన్‌లో నా శిష్యులు కొందరు పాల్గొన్నారు. నా శిష్యుల ప్రతిభను వేదిక మీద చూస్తున్నప్పుడు గురువుగా మురిసిపోతాను. ఈ సీజన్‌తో మరింత మంది యువ ప్రతిభావంతులను పరిశ్రమకు పరిచయం చేస్తాం. అంకిత భావం, అకుంఠిత శ్రమతో గాయనీ గాయకులు తమ తమ రంగాల్లో రాణించగలుగుతారు. తమను తాము నిరూపించుకోవాలన్న కసి ఉన్న అభ్యర్ధులకు తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 పర్ఫెక్ట్ స్టేజ్‌ అవుతుంది. ఈ సదవకాశాన్ని ప్రతిభావంతులు అందిపుచ్చుకుని సఫలీకృతం చేసుకోవాలి.”

అత్యద్భుతమైన, వైవిధ్యమైన ఆలోచనతో ఆహా కేవలం వినోదాన్ని అందించడమే కాదు, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సుమధురమైన గళాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. మన సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తోంది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి తనవంతు దోహదపడుతోంది.

గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది తెలుగు ఇండియన్‌ ఐడల్ 2 ఈరోజు రాత్రి ఏడు గంటల నుంచి ప్రసారం కానుంది

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News