చిత్ర పరిశ్రమలో ఆదర్శ మిత్రులు ,అగ్రశ్రేణి దర్శక నిర్మాతలుగా పేరు పొందిన ఎస్వీ కృష్ణారెడ్డి- అచ్చిరెడ్డి ద్వయానికి రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకపోయినప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరితో అనుబంధం ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ రాజకీయ వేదికలపై కనిపించలేదు.
అయితే ఇటీవల వారిద్దరూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాము రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాన్ని గురించి అడగగా “అది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే. రేవంత్ రెడ్డి గారు మాకు చిరకాల పరిచయస్తులు. అలాగే వారి అల్లుడు గారి తరఫున దూరపు బంధుత్వం కూడా ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత శుభాకాంక్షలు తెలపడం కోసం టైం తీసుకుని గత ఆదివారం రోజున ఆయన్ను కలిశాం. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని కేటాయించి మాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన దక్షత అభినందనీయంగా ఉంది. అదే విషయాన్ని వారి వద్ద ప్రస్తావించి శుభాకాంక్షలు చెప్పాము..” అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి.
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…
"టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026" జ్యూరీ ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ వ్యవహరిస్తారు: టీఎఫ్…
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక…