సోషల్ మీడియాలో ఫన్మోజీకి ఉండే ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. యూట్యూబ్లో ఫన్మోజీ నుంచి వచ్చే కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటూ బిలియన్ల వ్యూస్, మిలియన్ల సబ్ స్క్రైబర్లను సాధించుకుంది. ఇక ఇప్పుడు ఈ టీం వెండితెరపైకి రాబోతోంది. మన్వంతర మోషన్ పిక్చర్స్, శివం సెల్యూలాయిడ్స్ బ్యానర్ల మీద సుశాంత్ మహాన్ హీరోగా కె. సుధాకర రెడ్డి, రవి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ కొత్త చిత్రానికి సంబంధించి సినిమా కాన్సెప్ట్ తెలియజేసేలా ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే, అందులో ఇచ్చిన హింట్లను నిశితంగా గమనిస్తే సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఏదో అడ్వెంచరస్ మూవీని రూపొందిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
హీరో సుశాంత్ మహాన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక ఈ పోస్టర్లో హీరో రగ్డ్ లుక్, ఏదో సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా.. అందులో కొన్ని హింట్లను కూడా వదిలారు. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్తోనే అందరి దృష్టిని తమ వైపు లాక్కుని ఫన్ మోజీ టీం సక్సెస్ అయింది. ఈ మూవీ నుంచి మున్ముందు మరిన్ని అప్డేట్లు రానున్నాయి.
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్…
‘లిటిల్హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా…
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…