మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్మెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను శుక్రవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్గా, ఆగ్రహభరితమైన పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు” అని తెలిపారు. అలాగే అనన్య నాగళ్ల నటనను కూడా ప్రశంసించారు. దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా, విభిన్నంగా తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు.
చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, “ది బ్రేకింగ్ న్యూస్” ఒక మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్గా రూపొందుతోంది. ఈ సినిమాను 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
మురళీమోహన్, అనన్య నా గళ్ళ తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్: ఓపెన్ స్కై క్రియేషన్స్
రైటర్ అండ్ డైరెక్టర్: పవన్ కడియాల
ప్రొడ్యూసర్స్: హనుమాన్ రెడ్డి, ఉమా గూటూర్
మ్యూజిక్ డైరెక్టర్: శశి ప్రీతం
సినిమాటోగ్రఫీ: సాయినాథ్
ఎడిటర్ :శిరీష్ ప్రసాద్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: బి ఎన్ గణేష్,
అసిస్టెంట్ డైరెక్టర్: సంజీవ్ ధరణి, సాయి యోగేష్,
పబ్లిసిటీ డిజైనర్: మిట్టు ఆరేటి,
స్టిల్స్: పార్ధు,
ఫిలిం వీడియో ఎడిటర్: లూర్దు,
డిజిటల్ మీడియా పార్ట్నర్: కాలేపు హరి సాయి సందీప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమణారెడ్డి తాటిరెడ్డి,
కో ప్రొడ్యూసర్స్: రేఖ బైరి, నరేన్. కె,
పి ఆర్ ఓ: బి. వీరబాబు
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
▪️ భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘తీరం’ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న…
-ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "అదే నీవు అదే నేను" సినిమా ఇటీవల ప్రకటించిన…
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక కుటుంబ కథా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)”…
ప్రెస్ నోట్ Date: 26/07/2026పద్మశ్రీ పురస్కార గ్రహీత, కళా ప్రపూర్ణ డా. మంచు మోహన్ బాబు గారు మే 4…