సుహాస్, శ్రీధర్ రెడ్డి,’కేబుల్ రెడ్డి’- గ్రాండ్ గా ప్రారంభం

Must Read

సుహాస్, శ్రీధర్ రెడ్డి, ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ టైటిల్  ‘కేబుల్ రెడ్డి’- గ్రాండ్ గా ప్రారంభం

‘రైటర్ పద్మభూషణ్’ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో సుహాస్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ కోసం నూతన దర్శకుడు శ్రీధర్ రెడ్డి తో చేతులు కలిపారు. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కేబుల్ రెడ్డి’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. షాలిని కొండేపూడి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. శ్రీధర్ రెడ్డి(దర్శకుడు) కెమెరా స్విచాన్ చేయగా దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి స్క్రిప్ట్ ని మేకర్స్ కి అందించారు.

ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీధర్ మంచి స్నేహతుడు. తనకి ఇది తొలి చిత్రం. రెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. చాలా ఎక్సయిటింగా వుంది.” అన్నారు  

శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. చాలా ఆసక్తికరమైన కథ రాసుకున్నాను. అంతే ఆసక్తికరంగా, యంగేజింగా షూట్ చేయడానికి సన్నాహాలు చేశాం. ఒక టౌన్ లో జరిగే కథ ఇది. క్లీన్ ఎంటర్ టైనర్ గా వుంటుంది”అన్నారు

షాలిని కొండేపూడి మాట్లాడుతూ.. చాలామంచి టీంతో ఈ సినిమా చేస్తున్నాం. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు

బాలు వల్లు మాట్లాడుతూ .. ఇది మా మొదటి సినిమా. చాలా మంచి టీంతో పని చేస్తున్నాం. బౌండెడ్ స్క్రిప్ట్ తో షూట్ కి వెళ్తున్నాం. మొదటి షెడ్యుల్ 20 రోజుల్లో పూర్తి చేస్తున్నాం”అన్నారు.

ఈ చిత్రానికి మహి రెడ్డి పండుగల డీవోపీ గా పని చేస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా క్రాంతి ప్రియం  ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

నటీనటులు : సుహాస్, షాలిని కొండేపూడి

సాంకేతిక విభాగం :
దర్శకత్వం :  శ్రీధర్ రెడ్డి
నిర్మాతలు: బాలు వల్లు, ఫణి ఆచార్య
సినిమాటోగ్రాఫర్: మహి రెడ్డి పండుగల
సంగీతం: స్మరణ్ సాయి
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
పీఆర్వో : వంశీ – శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News