తిరగబడరసామీ’ టీజర్ చూస్తుంటే రాజ్ తరుణ్ యాక్షన్ ఇరగదీసినట్లు కనిపిస్తోంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
నిర్మాత దిల్ రాజు లాంచ్ చేసిన రాజ్ తరుణ్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మల్కాపురం శివకుమార్, సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ‘తిరగబడరసామీ’ టీజర్
యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇదివరకే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. ఈరోజు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రం టీజర్ లాంచ్ చేశారు.
హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు. అయితే, అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం. ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరిద్దరూ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులే. పరిస్థితులు అతని ట్రాక్ మార్చడానికి, హింసాత్మక మార్గాన్ని తీసుకోవాలని ప్రేరేపిస్తాయి. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథను ఎంచుకున్నారు. అందమైన ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఫన్, మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. తన వాళ్ళ కోసం తన మార్గాన్ని మార్చే అమాయక యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ యాప్ట్ గా కనిపించారు. హీరోయిన్ గా నటించిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపించింది. తను కొన్ని స్టంట్స్ కూడా చేసింది. మకరంద్ దేశ్పాండే విలన్ పాత్రలో కనిపించడం ఆసక్తికరం. మన్నారా చోప్రా కీలక పాత్ర పోషించింది.
ఈ చిత్రానికి జెబి సంగీతం అందిస్తున్నారు. జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. భాష్యశ్రీ డైలాగ్స్ అందిస్తున్నారు. సినిమా ప్రిమైజ్ పరిచయం చేసే టీజర్ కూల్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఏఎస్ రవికుమార్ చౌదరి పిల్లా నువ్వు లేని జీవితం లాంటి హిట్ చిత్రాలని అందించిన మా దర్శకుడు. అలాగే రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావా లాంటి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు. రాజ్ తరుణ్ ఎక్స్ టార్దినరీ ఆర్టిస్ట్. ఈ టీజర్ చూస్తుంటే అండర్ ప్లే పాత్ర చేసి ఫైనల్ గా తిరగబడరసామీ అని క్లైమాక్స్ లో ఇరగదీసినట్లు అర్ధమౌతుంది. ఎంటర్ టైమెంట్ సినిమా అనుకున్నాను. టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ సినిమాలా వుంది. రాజ్ తరుణ్, రవి కుమార్ కమ్ బ్యాక్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. దర్శకుడు రవికుమార్ చౌదరి గారు ఈ సినిమాతో నాలో కొత్త కోణం చూపించారు. నేను చిన్నచిన్నగా తప్పితే యాక్షన్ పెద్దగా ఎపుడూ చేయలేదు. క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు కూడా అడిగాను. ఇంతసేపు సైలెంట్ గా వున్నావ్ కాబట్టి ఎప్పుడో ఒకసారి పేలాల్సిందే అని చెప్పారు( నవ్వుతూ). సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే విడుదల చేస్తాం. మీ అందరికీ నచ్చుతుంది. దయచేసి అందరూ థియేటర్స్ లోనే చూడాలి. డోంట్ యంకరేజ్ పైరసీ’’ అన్నారు.
ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత నాకు మళ్ళీ రీబర్త్ ఇస్తున్న మా నిర్మాత శివకుమార్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీలో మరో యాక్షన్ హీరో అవుతారు. ఇది నా ప్రామిస్. ఇందులో సందేహం లేదు. తను డైరెక్టర్ ఆర్టిస్ట్. అలాగే మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా మంచి పాత్రలు చేశారు. జెబీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డీవోపీ జవహర్ రెడ్డి ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. ఈ సినిమా తర్వాత తనకి చాలా పేరువస్తుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.’’ తెలిపారు.
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. దిల్ రాజు గారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన టీజర్ లాంచ్ చేసి ప్రమోషన్స్ ని మొదలుపెట్టడం చాలా అనందంగా వుంది. వారికి ధన్యవాదాలు. దర్శకుడు రవి కుమార్ చౌదరి గారు ఈ కథ చెప్పిన వెంటనే నచ్చేసింది. రవి కుమార్ చౌదరి గారు ఎన్నో విజయాలు ఇచ్చారు. ఈ కథ ఎంత చక్కగా చెప్పారో దాని వంద రెట్లు అద్భుతంగా సినిమాని తీశారు. ఈ సినిమాతో ఆయనకి రీలైఫ్ స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను. నేను చేసిన చిత్రాల్లో సూర్య వెర్సస్ సూర్య నా మనసుకు దగ్గరైన చిత్రం. ఆ టీంతో మరో పది సినిమాలు చేయడానికి సిద్ధంగా వుంటాను. అదే విధంగా ఈ సినిమా టీంతో కూడా రెడీగా వుంటాను. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో గుమ్మడికాయ కొట్టినప్పుడు కూడా అదే సంతోషం వుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆ సంతోషం ఈ సినిమా విషయంలో వుంది. జెబీ మంచి మ్యూజిక్ ఇచ్చారు. డీవోపీ జవహర్ రెడ్డి ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. మాల్వి చక్కని నటన కనబరిచింది. మకరంద్ దేశ్పాండే ఈ సినిమా మరో ఎసెట్. అలాగే మన్నారా చోప్రా పాత్ర కూడా కీలకంగా వుంటుంది. ఆమెకు మంచి కమర్షియల్ సాంగ్ కూడా వుంటుంది. రాజ్ తరుణ్ తో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇందులో చాలా పరిణితి గల పాత్రలో అద్భుతంగా నటించారు. నిఖిల్ తో ఎలాంటి ఎటాచ్మెంట్ వుందో రాజ్ తరుణ్ తో కూడా అలంటి అనుబంధం వుంది. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా కంటెంట్ తో కలసి పని చేస్తాం. ‘తిరగబడరసామీ’ లో పని చేసిన అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.
మన్నారా చోప్రా మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో మొదటిసారి నెగిటివ్ రోల్ లో కనిపిస్తాను. పాత్ర చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో మంచి డ్యాన్సింగ్ నెంబర్ కూడా వుంది. రాజ్ తరుణ్ చాలా సపోర్టివ్ గా వుంటారు. తనతో మరిన్ని చిత్రాలు చేయాలని వుంది. మకరంద్ దేశ్ పాండే గారి కలసి నటించే అవకాశం రావడం కూడా అనందంగా వుంది. చిత్ర యూనిట్ అందరికీ థాంక్స్’’ తెలిపారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘తిరగబడరసామీ’ నిర్మాత మాకు స్నేహితులు. చాలా ఎంపికగా సినిమాలు చేస్తారు. ఈ సినిమా కోసం తను ఎంచుకున్న టీం అద్భుతంగా వుంది. టీజర్ లో అన్ని ఎలిమెంట్స్ వున్నాయి . దర్శకుడు రవికుమార్ చౌదరి గారు నా ఫేవరేట్ డైరెక్టర్. అలాగే రాజ్ తరుణ్ మాకు సినిమా చుపిస్తామా లాంటి మంచి విజయాన్ని ఇచ్చిన హీరో. తన విజయాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. దర్శకుడు రవికుమార్ గారు చాలా మంచి పాయింట్ తో తిరగబడరసామీ’ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. రాజ్ తరుణ్ కొత్త కోణంలో కనిపిస్తున్నారు. ఈ సినిమా కూడా ‘యజ్ఞం’లా చాలా పెద్ద హిట్ అవుతుంది’’ ఆన్నారు.
తాగుబోతు రమేష్.. దర్శకుడు రవికుమార్ చౌదరి గారు ఇండస్ట్రీలోని కమర్షియల్ డైరెక్టర్స్ లో టాప్ 3లో వుంటారు. ఆయనతో పని చేస్తే కమర్షియల్ పల్స్ తెలుస్తుంది. ఆయన దర్శకత్వంలో పని చేయడం అనందంగా వుంది. రాజ్ తరుణ్ గారితో పని చేయడం చాలా అనందంగా వుంటుంది. సినిమా చాలా అద్భుతంగా వుంటుంది. మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా
సంగీతం: జెబి
డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్
ఎడిటర్: బస్వా పైడిరెడ్డి
ఆర్ట్: రవికుమార్ గుర్రం
ఫైట్స్ – పృద్వీ, కార్తీక్
మాటలు: భాష్యశ్రీ
పీఆర్వో: వంశీ శేఖర్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…