‘స్లమ్ డాగ్ హజ్బెండ్’పై హీరోయిన్ ప్రణవి మానుకొండ ఇంటర్వ్యూ

Must Read

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రణవి మానుకొండ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..

నాకు చిన్నప్పటి నుంచి నటించడం అంటే చాలా ఇష్టం. అనుష్క నటించిన అరుంధతి సినిమా డైలాగ్స్‌ను అద్దం ముందు నిల్చుని చెప్పేదాన్ని. యాక్టింగ్ అంటే మమ్మీకి కూడా ఇష్టమే. వాళ్లు నన్ను చాలా ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచే ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. రొటీన్ లవ్ స్టోరీ, ఉయ్యాల జంపాలతో మంచి గుర్తింపు వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి ఆఫర్లు వచ్చాయి. సీరియల్స్‌లోనూ లీడ్‌గా చేశాను. కానీ నాకు సినిమాలంటే ఇష్టం. అందుకే ఇటు వైపు వచ్చాను. కళ్యాణ్ రామ్ గారి అమిగోస్‌లోనూ నటించాను. నేను చేసిన రీల్స్ నుంచి మైక్ టీవీ నుంచి ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను.

టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. కథ కూడా కొత్తగానే ఉంటుందనిపించింది. స్క్రిప్ట్ అంతా కూడా నవ్వుతూనే చదివాను. ఎక్కడా బోర్ కొట్టలేదు. ఈ సినిమాలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫన్ రైడ్‌తో పాటు ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేశారు దర్శకుడు. నేను చేసిన మౌనిక పాత్ర కూడా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ హీరోయిన్ కారెక్టర్‌లా ఉండదు. అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. అందుకే ఈ సినిమాను చేశాను. ఇది నా మొదటి చిత్రం కాస్త నెర్వస్‌గా ఉంది.

ఇంత మంచి బ్యానర్‌లో నాకు సినిమా అవకాశం రావడం ఆనందంగా ఉంది. నా మొదటి సినిమాలోనే పెద్ద ఆర్టిస్టులతో పని చేశాను. ఇలాంటి అదృష్టం నాకు దొరకడం ఆనందంగా ఉంది.

నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఇన్ స్టాగ్రాంలో రీల్స్ అందరూ చేస్తున్నారు కదా?.. నేను ఎందుకు చేయకూడదని అనుకున్నాను. నేను పోస్ట్ చేయడం ప్రారంభించాక జనాల నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చింది. అక్కడే నాకు రీచ్ ఎక్కువగా వచ్చింది.

సీరియల్, సినిమాలకు నటించే విధానంలో తేడా ఉంటుంది. సీరియల్స్‌లో డ్రామా ఎక్కువగా ఉండాలి.. సినిమాల్లో రియలిస్టిక్‌గా ఉండాలి. నాకు ఆ రెండు రకాల అనుభవం ఉంది.

స్టార్స్‌తో సినిమాలు చేయడం అంటే నాకు భయంగా ఉంటుంది. ఫస్ట్ టూ టేక్స్‌లోనే సీన్స్ చేస్తాను. అంతకంటే ఎక్కువ తీసుకోను.

సంజయ్‌తో ఎంతో ఫ్రీగా, నేచురల్‌గా నటించాను. ఎంతో కంఫర్టబుల్‌గా నటించాం. మేం ఇద్దరం సహజంగానే నటించుకుంటూ వెళ్లాం.

తెలుగు అమ్మాయిని అవ్వడం ప్లస్‌గానే భావిస్తాను. మనకు ఉండే నేటివిటీ మన వాళ్లకే ఉంటుంది. పక్క భాషల నుంచి వచ్చే వారికి ఉండదు. రెగ్యులర్ కారెక్టర్లు కాకుండా.. నేను చేసే పాత్రలకు ప్రాధాన్యం ఉండాలని భావిస్తాను. కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ అయినా డీ గ్లామర్‌గానైనా నటిస్తాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా కూడా సినిమాల మీదే ఉంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News