కళ్యాణ్ రామ్ చేతుల మీదగా స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్ విడుదల..

Must Read

సంజయ్ రావ్ హీరో గా స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్ ఈరోజు ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ చేతుల మీదగా విడుదల అయ్యింది.

Slum Dog Husband - Official Trailer | Sanjay Rrao, Pranavi | Bheems Ceciroleo

పిట్ట కథ సినిమాతో తెరంగేట్రం చేసిన యువ నటుడు సంజయ్ రావ్ “స్లమ్ డాగ్ హస్బెండ్” అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఈ హీరో నటించిన పిట్ట కథ సినిమా వైవిద్యమైన థ్రిల్లర్ గా వచ్చి అప్పట్లో అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాబోతున్న ఈ చిత్రం కూడా వైవిధ్యమైన కామెడీ ఎంటర్టైనింగ్ కథతో రాబోతోంది అని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

స్లమ్ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి,అబ్బాయి, పెళ్లి కోసం తాపత్రయం పడే సీన్లతో ట్రైలర్ స్టార్ట్ కాగా, ఆ తరువాత ఈ ట్రైలర్ మొత్తం చాలా డిఫరెంట్ గా కొనసాగింది. ఆ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అబ్బాయికి ఒక గండం ఉందడంతో తాను ఆ కారణం వల్ల మొదటిగా కుక్కని పెళ్లి చేసుకోవడం, ఇక కుక్కని పెళ్లి చేసుకున్నాక ఆ గంధం గట్టెక్కింది అనే నమ్మకంతో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కోర్టులో మొదటి భార్య (కుక్క) బతికి ఉండగా రెండో భార్యని ఎలా చేసుకుంటారు అని కేసు పెట్టడంతో ఈ ట్రైలర్ మరింత ఆసక్తిగా మారింది. ఇక ఈ ట్రైలర్ చూశాక ప్రేక్షకులకు ఇది వింతగా అనిపియ్యదమే కాకుండా ఎక్సైట్మెంట్ ని కూడా పెంచేయడం ఖాయం. ముఖ్యంగా ట్రైలర్ మొత్తం మంచి కామెడీ తో కూడి, ఆధ్యాంతం ఈ సినిమా ప్రేక్షకులను చూసినంత సేపు నవ్విస్తూ ఉంటుంది అనే క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు ఈ ట్రైలర్ లో బ్రహ్మాజీ, సప్తగిరి అలానే ఆలీ లాంటి వాళ్ళు మంచి కామెడీని పండించారు.

సరైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాకి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా, మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక సినిమా మేకర్స్ త్వరలోనే త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

తారాగణం & సిబ్బంది

నటీనటులు:: సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సునీల్

ఆర్ట్ డైరెక్టర్:: సురేష్ రెడ్రౌతు
కాస్ట్యూమ్స్:: తేజ & నరేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:: రమేష్ కైగురి
చీఫ్ ఎడి:: కట్టా రామకృష్ణ
DOP:: శ్రీనివాస్ J రెడ్డి
ఎడిటర్:: ఎ. వైష్ణవ్ వాసు
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
బిజినెస్ హెడ్:: రాజేంద్ర కొండా
సహ నిర్మాతలు:: నిహార్ దేవెళ్ల, M K చైతన్య పెన్మెత్స, చింతా మెర్వాన్, ప్రకాష్ జిర్రా, రవళి గణేష్, సోహం రెడ్డి మన్నెం
నిర్మాతలు:: అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం:: ఏ ఆర్ శ్రీధర్
బ్యానర్:: మైక్ మూవీస్
PRO:: GSK మీడియా

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News