* దీపావళికి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్పై కార్తికేయన్ నిర్మిస్తోన్న చిత్రం ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’. రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీపావళికి గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
‘జిగర్ తండా డబుల్ ఎక్స్’మూవీ అనౌన్స్మెంట్ రోజు నుంచే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అందుకు కారణం.. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన జిగర్ తండా చిత్రానికి ఇది ప్రీక్వెల్. సినిమా ఎలా ఉండబోతుందోనిన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ ‘‘‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ షూటింగ్ అంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జింగ్ తండాకు ప్రీక్వెల్గా రాబోతున్న ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ను ఈ దీపావళికి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. జిగర్ తండాను మించిన ఎగ్జయిట్మెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
స్టోన్ బెంచ్ ఫిలింస్ అధినేత కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ ‘‘‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ హై యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేశాం. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీపావళికి భారీ ఎత్తున తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు
నందు, అవికా గోర్ జంటగా నటిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన 'అగ్లీ స్టోరీ' చిత్రానికి వచ్చిన అనూష స్పందనకు ఈ…
ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్,…
సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల…
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా…
రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్ కమ్బ్యాక్కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'వడ్డీ కాసుల…
హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ను…