బారీ అంచనాల నడుమ రిలీజ్కు రెడీ అవుతోన్న షారూక్ ఖాన్ ‘జవాన్’.. ట్రైలర్ రిలీజ్ కాకుండానే రూ.250 కోట్లకు అమ్ముడైన నాన్ థియేట్రికల్ రైట్స్
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే ‘జవాన్’ ట్రైలర్ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా థియేటర్స్లో ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్.. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు కావటం విశేషం. యాక్షన్ ఎలిమెంట్స్, నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో కూడిన జవాన్ ట్రైలర్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాధారణంగానే షారూక్ ఖాన్ సినిమాలకు సంబంధించిన హక్కులన్నీ ఫ్యాన్సీ రేట్లకే అమ్ముడవుతుంటాయి. అయితే తాజాగా ఆయన గత సినిమాల రికార్డులను ఆయన తాజా చిత్రాలు దాటేస్తున్నాయి.
ఆయన గత చిత్రం పఠాన్ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడు జవాన్పై భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం అందరూ పోటీ పడుతున్నారు. ఇక నాన్ థియేట్రికల్ హక్కులు హాట్ కేకులా అమ్ముడవటం చూస్తుంటే షారూక్ ఖాన్కి ఉన్న క్రేజ్ ఎంటనేది స్పష్టమైంది.
షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…
నిర్మాత గా ఒక చరిత్ర సృష్టించిన ఎం.ఎస్. రాజు , దర్శకునిగా ‘అగధ’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా…
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
పీఆర్ఓగా, జర్నలిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్ తరిగోపులతో…
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్…