హాలీవుడ్ యాక్ష‌న్ మాస్ట్రో `స్పీరో ర‌జ‌టోస్‌`తో చేతులు క‌లిపి షారూఖ్ ఖాన్‌..

Must Read

`

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `జ‌వాన్‌`. ఈసినిమాలో ఆయ‌న చేసిన ఫైట్స్ ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేయ‌టం ఖాయం. ఆయ‌న త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌నున్నారు. ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను రేపు భారీ స్క్రీన్‌పై చూసిన‌ప్పుడు ప్రేక్ష‌కులకు ఓ విజువ‌ల్ ఎక్స్‌పీరియెన్స్ రావ‌టం ప‌క్కా. హాలీవుడ్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌, కెప్టెన్ అమెరికా వంటి టాప్ మోస్ట్ యాక్ష‌న్ మూవీస్‌కి యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన ప్ర‌ముఖ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ స్పిరో ర‌జ‌టోస్.. `జ‌వాన్‌` సినిమాకు యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను కంపోజ్ చేశారు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌, కెప్టెన్ అమెరికా, వెనోమ్‌, స్టార్ ట్రెక్‌, టీనేజ్ ముటంట్ నింజా ట‌ర్ట‌ల్స్ వంటి సినిమాల‌కు ప‌నిచేసిన అపార‌మైన అనుభ‌వంతో స్పిరో ర‌జ‌టోస్ జ‌వాన్ సినిమాకు క‌ళ్లు చెదిరే, వావ్ అని ఆశ్చ‌ర్య‌పోయేలా యాక్ష‌న్ సన్నివేశాల‌ను డైరెక్ట్ చేశారు.

మ‌ల్టీ టాలెంటెడ్ స్టంట్ మ్యాన్‌, స్టంట్ కో ఆర్టినేట‌ర్‌, డైరెక్ట‌ర్‌గా పేరున్న స్పిరో ర‌జ‌టోస్ హాలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర వేశారు. ఆయ‌న యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు బెస్ట్ స్టంట్ కో ఆర్టినేట‌ర్‌గా టార‌స్ అవార్డుతో పాటు 2004లో విడుద‌లైన బ్యాడ్ బాయ్స్ IIకి మూడు అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. ఆయ‌న అనుభ‌వం, క్రియేటివిటీతో `జ‌వాన్‌` సినిమాను నెక్ట్స్ రేంజ్‌లో చూడొచ్చన‌టంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ఫైట్స్ అద్భుతంగా వావ్ అనిపించేలా ఉండ‌బోతున్నాయి.

రేపు వెండితెర‌పై `జ‌వాన్‌` సినిమాను చూస్తున్న‌ప్పుడు స్పిరో ర‌జ‌టోస్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను షారూఖ్ స్క్రీన్‌పై అద్భుతంగా ప్ర‌దర్శిన్న‌ప్పుడు ప్రేక్ష‌కులు తెలియ‌ని ఉద్వేగానికి లోన‌వుతారు. వీరిద్ద‌కి క‌ల‌యిక‌లో రానున్న జ‌వాన్ యాక్ష‌న్ సీన్స్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌ను వేస్తుంది.

రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో.. అట్లీ ద‌ర్శ‌కత్వంలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌవ‌ర్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News