ఓ మై లవ్, 18 టు 25 బళ్లారి, దర్బార్.. వంటి కన్నడ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి
టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న స్మైల్ శ్రీను ఇప్పుడు తెలుగు కన్నడ భాషల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫీల్ గుడ్ మూవీస్ చేసి కన్నడ ప్రేక్షకుల మనసులో మంచి పేరు తెచ్చుకున్న స్మైల్ శ్రీను దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ఓ మై లవ్ 50 రోజులు పూర్తి చేసుకొని ఘన విజయం సాధించింది. అదే జోష్తో ఉన్న స్మైల్ శ్రీను ఇప్పుడు ”నాకొక పెళ్ళాం కావాలి” అనే చిత్రం ద్వారా హీరోగా రానున్నారు.
ఈ చిత్రానికి హరి అల్లినేని దర్శకుడిగా పరిచయం కానున్నారు.
ఇప్పుడు ఈ సినిమా కథకు సూటయ్యే హీరో స్మైల్ శ్రీను కి పిల్లని ( హీరోయిన్) వేతికె పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అలానే కొంతమంది చిత్ర యూనిట్ టెక్నీషయన్లును ఎంపిక చేసే పనిలో ఉన్నారు.
ఈ సందర్భంగా హీరో స్మైల్ శ్రీను మాట్లాడుతూ.. తెలుగు కన్నడ బాషల్లో హీరోగా నా తొలి సినిమా ఇది. తెలుగులో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు హరి అల్లినేని ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తి చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరిని అలరిస్తుంది.” అని అన్నారు.
డైరెక్టర్ హరి అల్లినేని మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్టు బాగా వచ్చింది. జనవరిలో సెట్ మీదకి తీసుకెళ్లబోతున్నాం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను, టెక్నికల్, కాస్ట్ ఆండ్ క్రూ త్వరలోనే ప్రకటించబోతున్నాం..” అని అన్నారు.
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్…
రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ ప్రధాన చిత్రీకరణ పూర్తైంది.…
బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ కు ఈ సమ్మర్ ఎంతో స్పెషల్ గా ఉండబోతోంది. ఆమె నటించిన రెండు…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్…
‘లిటిల్హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా…