నాగ చైతన్య, సాయి పల్లవి జోడి ఇంతకు ముందు ‘లవ్ స్టోరీ’తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తండేల్’ లో వారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీతో మనల్ని ఆలరించబోతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవిపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
సెట్ లో సాయి పల్లవి బర్త్ డే సెలబ్రేషన్స్ ని చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి, చిత్ర సమర్పకులు అల్లు అరవింద్, చిత్ర యూనిట్ పాల్గొని సాయి పల్లవికి బర్త్ డే విషెస్ తెలియజేశారు.
సాయి పల్లవి బర్త్ డే సందర్భం గా విడుదల చేసిన రెండు పోస్టర్లు, స్పెషల్ వీడియో గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్లు, స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య, సాయిపల్లవి జోడి మరో సారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతోంది. ఇందులో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించనున్నారు. క్యారెక్టర్ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు.
రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, శామ్దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…