RX100 ఫేమ్ పూజా “సూర్యా పెట్ జంక్షన్” ఐటమ్ సాంగ్

Must Read

యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ ఎన్. శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సూర్యా పెట్ జంక్షన్ ఈ చిత్రానికి రాజేష్ దర్శకత్వం చేస్తున్నారు
ఈశ్వర్ హీరోగా నైనా సర్వార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ గర్ల్ పూజ (అర్.ఎక్స్ 100 ఫేమ్) అభిమన్య సింగ్ విలన్ గా నటిస్తున్న చిత్రం ”సూర్యా పెట్ జంక్షన్ ” ఈ చిత్రం ఐటమ్ సాంగ్ సిసిసి క్రికెట్ కప్ విన్నర్స్ చేతులమీదుగా విడుదల అయ్యింది ఈ కార్యక్రమానికి. సిసిసి బాలీవుడ్ టీమ్ టాలీవుడ్ టీమ్ సిసిసి అధ్యక్షుడు షకీల్ మరియు సూర్యా పెట్ జంక్షన్ హీరో ఈశ్వర్ హీరోయిన్ నైన సర్వార్ ఐటమ్ సాంగ్ గర్ల్ పూజా ఆర్టిస్ట్ హరిష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ
మా సూర్యాపేట్ జంక్షన్ మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్ విడుదల చేసే అవకాశం ఇచ్చిన సీసీసీ అధ్యక్షులు షకీల్ గారికి మా సాంగ్ లాంచ్ చేసిన టాలీవుడ్ టీమ్ బాలీవుడ్ టీమ్ కి నా హృదయ పూర్వక కతజ్ఞతలు ఈ చిత్ర ఆడియో టిప్స్ తెలుగు ద్వారా ఆడియో విడుదల అవుతుంది.
మా చిత్రం త్వరోనే విడుదలకు రెడీ అవుతున్నాము. ప్రమోషన్స్ లో బాగంగా మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్ ఓన్ కంపోజ్ లో రీల్ చేసి మా యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ సోషల్ మీడియా అకౌంట్ కి #టెగ్ చెయ్యాలి దానికంటే ముందు మా టీజర్ ని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి రిజిష్టర్ అవ్వాలి.
అలా చేసిన టాప్ రీచ్ వచ్చిన వీడియో కి ఒక లక్ష రూపాయల ప్రైజ్ మని ఫస్ట్ బెస్ట్ రీల్ చేసిన 10 వీడియోస్ కి ఒక్కోకరికి 10వేల సెకెండ్ బెస్ట్ 10 రీల్స్ కి ఒక్కొకరికీ 5వేల రూపాయలు ఇవ్వబడుతుంది. ఈ కాంటెస్ట్ రీల్స్ నీ 10రోజుల లోపు పంపించాలి అని తెలిపారు.
హీరోయిన్ నైనా సర్వార్ మాట్లాడుతూ మా చిత్రంలోని పాటని విడుదల చేసినందుకు ప్రతి ఒక్కరికీ చాలా థాంక్స్ మీ మీడియా మా టీమ్ కి గుడ్ సపోర్ట్ చేయండి చాలా థాంక్స్ మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్
రీల్ చెయ్యండి లక్ష గెలవండి.
పూజా మాట్లాడుతూ… నాకు ఈ అవకాశం ఇచ్చిన యోగలక్ష్మి క్రియేషన్స్ టీమ్ థాంక్స్ నేను చేసిన మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్ కాంటెస్ట్ చెయ్యడం మా సూర్యా పెట్ జంక్షన్ సినిమాకే కాకుండా నా కెరియర్ కు చాలా ప్లుస్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్న మా సాంగ్ రీల్ చెయ్యండి లక్ష రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకుండి.

నటీనటులు ఈశ్వర, నైనా సర్వార్, అభిమన్యు సింగ్, లక్ష్మణ్,బాషా, సూర్య,హరీష్, చలాకీ చంటి,మున్న వేణు, చమ్మక్ చంద్ర, కోటేశ్వర రావు,

సాంకేతిక నిపుణులు బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ టైటిల్ : సూర్యాపేట జంక్షన్

నిర్మాతలు : అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.శ్రీనివాస రావు, విష్ణువర్ధన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పాండు అలిజాల డైరెక్టర్ : యన్. రాజేష్ స్టోరీ : ఈశ్వర్ మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరిడి.ఓ.పి : అరుణ్ ప్రసాద్ఎడిటర్ : ఎం.ఆర్.వర్మకో డైరెక్టర్ : శ్రీనివాస్లిరిక్స్ : ఎ.రహమాన్ పోస్టర్ డిజైనర్ ధనియేలెరైటర్స్ : సత్య,రాజేంద్ర భరద్వాజ్ పి. ఆర్. ఓ : కడలి రాంబాబుడిజిటల్ : సెలబ్రిటీ మీడియా

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News