రుద్రంగి ప్రీ రిలీజ్ వేడుక లో నటసింహం నందమూరి బాలకృష్ణ

Must Read

సినిమాలలో విలన్ పాత్రలు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి కెరియర్ లో బాగానే ముందుకు దూసుకు వెళుతున్న జగపతిబాబు ఇప్పుడు మళ్ళీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. “రుద్రంగి” అనే సినిమాతో జగపతిబాబు త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మమత మోహన్ దాస్ మరియు విమల రామన్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 7న సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఏర్పాటు చేయగా నందమూరి బాలకృష్ణ దీనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఆశిష్ గాంధీ మాట్లాడుతూ, “జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ ని సపోర్ట్ చేస్తున్నందుకు నందమూరి బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. థాంక్ యు సార్. వీ ఆల్ లవ్ యు. మీరు మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. నేను మిమ్మల్ని పీపుల్స్ స్టార్ అని పిలుస్తాను. జగపతిబాబు గారి గురించి చెప్పాలంటే ఆయనతో ఇది నా రెండవ సినిమా. షూటింగ్ సమయంలో నేను ఆయనతో ఫోటో దిగుతున్నప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు. ‘నువ్వు చాలా మంచి యాక్టర్ వి’ అన్నారు. మల్లేష్ లాంటి పవర్ఫుల్ పాత్ర నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. సినిమా అంతా టెక్నికల్ టీమ్ పనితనమే. 7/7 న ఈ సినిమా విడుదలవుతుంది. సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను” అని అన్నారు.

చిత్ర హీరోయిన్ గాహ్నవి మాట్లాడుతూ, “మీడియా వారికి నా కృతజ్ఞతలు. గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ గారికి కూడా థాంక్యూ. ఒక సినిమా ఈవెంట్లో హైదరాబాద్ స్టేజ్ మీద నేను మాట్లాడటం ఇది రెండవసారి. కానీ తెలుగులో ఇది నా మొదటి సినిమా. జగపతి బాబు గారు ఒక అద్భుతమైన నటుడు. ఆయన తన పాత్రలోకి పూర్తిగా వెళ్లిపోయి నటిస్తారు. ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ కచ్చితంగా నచ్చుతుంది. మమతా మోహన్దాస్ మరియు విమల రామన్ లాంటి వారిని చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. నాకు సహాయం చేసినందుకు ఆశిష్ కి నా కృతజ్ఞతలు. సినిమా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

దివి మాట్లాడుతూ, “బాలయ్య సార్ ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్యూ. సినిమాలో నేను ఒక పాటలో కనిపిస్తాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అజయ్ గారికి నా కృతజ్ఞతలు. ట్రైలర్ లో జగపతిబాబు గారు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. మమత మరియు విమల రామన్ గార్లు చాలా అందంగా ఉన్నారు,” అని అన్నారు.

చరిష్మా మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. బాలయ్య గారు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. ఇలాంటి మంచి సినిమాలో నేను కూడా భాగం అయినందుకు చాలా హ్యాపీ గా ఉన్నాను. సినిమా జులై లో వస్తుంది. అందరికీ నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను.

మమత మోహన్ దాస్ మాట్లాడుతూ, “జై జై బాలయ్య. అందరికీ హాయ్. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక తెలుగు సినిమాలో నటించాను. రుద్రంగి సినిమా మొత్తం అజయ్ ఇమాజినేషన్ లో ఉంది. అందులో జ్వాల పాత్రలో నన్ను ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కరియర్ లో చాలా ముందుకు వెళ్తారు. అతను మామూలు డైరెక్టర్ కాదు. ఆయన లో ఒక ఫైర్ ఉంది. సినిమా కోసం చిత్ర బృందం చాలా కష్టపడింది. నా మంచి స్నేహితుడు జగపతిబాబు లేకుండా ఈ సినిమా పూర్తయ్యేదే కాదు. ఇక్కడికి వచ్చినందుకు బాలకృష్ణ సార్ కి కూడా థాంక్యూ. ఆశిష్ సినిమాలోని పర్ఫామెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సౌత్ లో మరకమాస్ హీరో అయ్యే అవకాశం నీకు కచ్చితంగా ఉంది. మిమ్మల్ని చాలా కాలం తర్వాత చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సపోర్ట్ వల్లే నేను మళ్ళీ తెలుగు సినిమాల్లోకి వచ్చాను. నీ సపోర్ట్ అలాగే కొనసాగుతుందని అనుకుంటున్నాను” అని అన్నారు.

డైరెక్టర్ అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ, “నన్ను కన్న నా తల్లికి నన్ను పోషిస్తున్న కళమ్మ తల్లికి నా సాష్టాంగ ప్రణామాలు. ప్రతి డైరెక్టర్ తన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు. కానీ నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ఈ సినిమాని పూర్తి చేశాను. థాంక్ యూ రస్మయి గారు. బాలయ్య గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నాకు గౌరవం కంటే ప్రేమించడమే వచ్చి. సినిమా గురించి చెప్పాలంటే మన చుట్టూ ఎన్నో రాజుల కోటలు, ఎత్తైన భవనాలు ఉంటాయి. కానీ ఎంతో అందమైన వి కేవలం పక్షులు కట్టే గూడు. సినిమా ని దాంతో పోలిస్తే నన్ను భరిస్తూ సినిమా కోసం పని చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఇలాంటి మరొక వంద సినిమాలను నాంది పలకాలి అని కోరుకుంటున్నాను. జై రుద్రాంగి, జై బాలయ్య” అని అన్నారు.

చిత్ర నిర్మాత రస్మయి మాట్లాడుతూ, “ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎదురుగా లెజెండ్ ఉండగా నాకు మాటలు రావడం లేదు. అడగగానే ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చిన బాలయ్య గారికి, నాకు ఇష్టమైన హీరో జగపతి బాబు గారికి, సినిమా నటీనటులకు, టెక్నీషయన్ల కు నా కృతజ్ఞతలు. బాలయ్య గారిని హిందూపురం వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారో నాకు తెలుసు. ఆయన చాలా సామాన్యమైన వ్యక్తిగా మనుషుల్ని ప్రేమిస్తారు. జగపతిబాబు గారు లేకపోతే అసలు ఈ సినిమానే లేదు. ఆయన పాత్రకి ప్రాణం పోశారనే చెప్పుకోవాలి. తెలంగాణ యాస లో ఆయన డైలాగులు అందరికీ గుర్తుండిపోతాయి. సినిమా ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలి అని కోరుకుంటున్నాను” అని అన్నారు.

హీరో గా నటించిన జగపతి బాబు మాట్లాడుతూ “బాలకృష్ణ గారు చాలా బిజీ గా ఉంటారు. కానీ నేను వెళ్లి అడిగితే కాదనరు అన్న నమ్మకంతో వెళ్లి అడిగాను. ఏమీ అడగకుండా కేవలం ఎప్పుడు పెట్టుకుందాం అని మాత్రమే అడిగి ఇక్కడికి వచ్చారు. ఆయన లెజెండ్ సినిమానే నాకు మళ్ళీ ప్రాణం పోసింది. ఇక హీరోగా మళ్లీ నా మూడవ ఇన్నింగ్స్ కి కూడా బాలయ్య గారు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సినిమా కథ అన్నీ బావున్నాయి కానీ బడ్జెట్ కి నేను సరిపోను అని చెబుతూ వచ్చాను కానీ డైరెక్టర్ మరియు నిర్మాత చాలా నమ్మకం తో చేశారు. నేను “లెజెండ్” తర్వాత ఎన్నో సినిమాలు చేశాను కానీ అందులో చెప్పుకోదగ్గవి 10 కూడా లేవు. ఈ సినిమా తో మళ్లీ నాకు మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నాను. అజయ్ తో మళ్ళీ ఇంకో సినిమా చేసి తీరుతాను. తెలంగాణ సినిమా ఇది. అందరికీ నచ్చుతుంది అని నాకు నమ్మకం ఉంది” అని అన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. నాకు రస్మయి గారికి రాజకీయాలు తెలియవు. కానీ మా నాన్నగారి ఇన్స్పిరేషన్ తో వచ్చాము. రుద్రంగి లాంటి సినిమా లు చాలా అరుదుగా వస్తాయి. మా నాన్నగారు అలాంటి సినిమాలు చాలా చేశారు. ఇప్పుడు జగపతి బాబు అలాంటి సినిమా చేస్తూ ఉండడం చాలా సంతోషం గా ఉంది. ఏదైనా పాత్ర చేసేటప్పుడు అందులో నటించడం కంటే జీవించడం గొప్ప. అలాంటి నటుడే జగపతి బాబు. సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ కోసమే మేము ఇంకా పని చేస్తున్నాము. మమత మోహన్ దాస్ ఒక వీర వనిత. క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా నాకు తెలుసు వాళ్ళు ఎంత క్షోభ పడతారు అని కానీ ఆమె చాలా ధైర్యం గా ఉండి ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచారు.” అని అన్నారు. చిత్ర బృందాన్ని పొగిడి సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు బాలయ్య.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News