ఆదివారం రిలీజ్ అయిన టీజర్.జూలై 17న గ్రాండ్ థియేట్రికల్ రీ రిలీజ్
రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా చేసుకుని ‘రక్త చరిత్ర’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని క్రియేటివ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలిపారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం 2010లో విడుదలై, అప్పట్లో సూపర్ హిట్ అయింది. తన స్పృజనాత్మకతకు, ఆ టైమ్ లో వచ్చిన కొత్త టెక్నాలజీని మేళవించి సినిమాలను తీయడంలో పేరుగాంచిన వర్మ ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ప్రతిబింబంగా రూపొందించారు. రాయలసీమలోని అనంతపూర్ లో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఫ్యాక్షనిజంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్న అంశాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. 16 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ…”ఈ సినిమాను రీ రిలీజ్ చేయమని ప్రేక్షకులు వివిధ ఫ్లాట్ ఫార్మ్స్ లో కోరుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో చూడని నేటి తరం ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం చేరువ కావాలన్న సంకల్పంతో జూలై 17న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదివారం ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశాం. త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తాం. ఆగష్టు నెలలో దీని కొనసాగింపు చిత్రమైన ‘రక్త చరిత్ర’ పార్ట్ -2ను సైతం రీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం” అని చెప్పారు.
కర్ణాటక..చిక్కబళ్ళాపుర జిల్లా చింతామణి లో నివసించిన గాయత్రమ్మ ఆంజినప్పవాళ్ళ నిర్మాణంలో నవనారాయణ క్రియేషన్స్ బ్యానర్లో కాగితం పడవలు సినిమాను నిర్మించారు…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్…
హైదరాబాద్లోని NI-MSME ప్రాంగణంలో జరిగిన సినికేథన్ 2026 కార్యక్రమంలో, కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ జి.…
విజయాలు సాధించే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి. కానీ, చరిత్ర సృష్టించి, చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన…
ఆ నలుగురి వల్లే నేను ఇంత అభివృద్ధి అయ్యానుమాగంటి మురళీ మోహన్ … తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని…
వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరోయిన్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో…