గ్రాండ్‌గా ‘రాచరికం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జనవరి 31న చిత్రం విడుదల

Must Read

అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాచరికం’. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేశ్ లంకలపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని జనవరి 31న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు మూవీ ప్రీ రిలీజ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘రాచరికం’ టైటిల్లోనే ఓ రాయల్టి ఉంటుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూపిస్తామా? అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. సురేష్ గారి పనితనం, డెడికేషన్ ప్రతీ షాట్‌లో కనిపిస్తుంది. నా బ్రదర్ మన్మథరావు సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమాను గొప్పగా తీయాలని ఈశ్వర్ గారు అహర్నిశలు కష్టపడ్డారు. రాయలసీమ అంటే ఏంటో ఈ సినిమా చూపిస్తుంది. ఇంత పెద్ద పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు సురేష్ గారికి థాంక్స్. మా డీఓపీ బాలీవుడ్‌లో బిజీగా ఉన్నా కూడా మాకోసం వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ ఇంకా మైండ్‌లోనే తిరుగుతున్నాయి. రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మా చిత్రం జనవరి 31న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాలో నెగెటివ్ పాత్రను చేశాను. మైఖేల్ తరువాత మళ్లీ ఈ పాత్ర నన్ను ఎగ్జైట్ చేసింది. అందుకే ఈ సినిమాలో నటించాను. సురేశ్ మరియు ఈశ్వర్ అద్భుతంగా తీశారు. అప్సరా, విజయ్ కెమిస్ట్రీ బాగుంది. మ్యూజిక్ బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు సురేశ్ లంకలపల్లి మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాకు నా టీం ఎంతో సహకరించింది. నటించిన ఆర్టిస్టులందరికీ థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి, డీఓపీ ఆర్య సాయి, రైటర్ రాం ప్రసాద్, వీఎఫ్ఎక్స్ చందు, ఎడిటర్ జేపీలకు ప్రత్యేకంగా థాంక్స్. నా డైరెక్షన్ టీం నా వెన్నంటే ఉంటూ నడిపించింది. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా ఉంటుంది. వంద కోట్లతో తీసిన సినిమాలా కనిపిస్తుంది. రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఎడిటర్ జేపీగారు సినిమాను అద్భుతంగా కట్ చేశారు. కథ రాసినప్పటి నుంచి ఈశ్వర్ నాతోపాటున్నారు. ఎవరి కోసమో ఎదురుచూడటం ఎందుకు మనమే నిర్మిద్దామని ఈశ్వర్ ముందుకు వచ్చారు. విజయ్ గారు చాలా డెడికేటెడ్‌గా నటించారు. అప్సరా రాణి గారు మాత్రమే ఈ పాత్రను చేయాలని ముందే ఫిక్స్ అయ్యాను. ఆమె అద్భుతంగా నటించారు. విజయ రామరాజు విలనిజం చూసి అంతా
షాక్ అవుతారు. వరుణ్ సందేశ్ గారి కారెక్టర్ అదిరిపోతుంది. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

నిర్మాత ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారికి థాంక్స్. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరి గురించి సురేశ్ చాలా బాగా చెప్పాడు. మా ట్రైలర్‌ను అశోక్ అద్భుతంగా కట్ చేశాడు. డైరెక్టర్ మారుతి గారు ట్రైలర్ లాంచ్ చేయడంతో ఎక్కువగా రీచ్ అయింది. శ్రీ విష్ణు గారు మౌలా పాటను లాంఛ్ చేశారు. టిక్కు టిక్కు పాటను రాహుల్ సంకృత్యాన్ గారు రిలీజ్ చేశారు. నేను, సురేష్, చాణక్య కలిసి చేసిన ఈ సినిమాకు నా ఫ్రెండ్స్ అండగా నిలిచారు. బడ్జెట్ పెరిగిపోతోన్న ప్రతీ సారి నా స్నేహితులే నాకు సపోర్ట్‌గా నిలిచారు. మన ప్రయత్నాల్ని మధ్యలో ఆపేయకూడదు. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. సురేష్, నేను, చాణక్య కలిసి కష్టపడి ఇక్కడకు వచ్చాం. విజయ్ శంకర్ ఎంతో ఒదిగి ఉంటాడు. అప్సరా అద్భుతంగా నటించారు. విజయరామరాజు పర్ఫామెన్స్ చూసి షాక్ అవుతారు. వరుణ్ సందేశ్ గారు చాలా సపోర్ట్ చేశారు. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

అప్సరా రాణి మాట్లాడుతూ.. ‘‘రాచరికం’ మూవీ జనవరి 31న రాబోతోంది. ఈ చిత్రంలో ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన సురేశ్, ఈశ్వర్ గారికి థాంక్స్. ఒకే రకమైన పాత్రలు వస్తున్నాయని సినిమాలు వదిలేయాలని అనుకున్నా. ఆ టైంలోనే ఆ దేవుడు వీళ్లని నా దగ్గరకు పంపించాడు. విజయ్ శంకర్‌తో నటించడం ఆనందంగా ఉంది. సురేశ్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. జనవరి 31న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వెంగి మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాలోని పాటలు చాలా బాగా వచ్చాయి. ఐపీఎల్ మూవీకి సురేశ్ గారితో పని చేశాను. ఈ మూవీని చాలా రిచ్‌గా తీశారు. నిర్మాత చాలా ఖర్చు పెట్టారు. విజయ్ శంకర్, అప్సరా రాణి, వరుణ్ సందేశ్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. ఆర్టిస్టుల పర్ఫామెన్స్, కెమెరా వర్క్‌‌కి తగ్గట్టుగా నేను మ్యూజిక్ ఇచ్చాను. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రాచీ థాకర్ మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు సురేశ్, నిర్మాత ఈశ్వర్ గారికి థాంక్స్. విజయ్ శంకర్, అప్సరా, ప్రీతి ఇలా అందరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

అనుపమ స్వాతి మాట్లాడుతూ.. ‘రాచరికం చిత్రంలో అప్సరా రాణికి తల్లిగా నటించాను. ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. జనవరి 31న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

టీఎస్సార్ మూవీ మేకర్ అధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘రాచరికం చూశాక సురేశ్ లంకపల్లి మా బ్యానర్లో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇది చాలా పెద్ద సినిమా కాబోతోంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

చాణక్య మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాతో దర్శకుడు సురేశ్ తన సత్తా ఏంటో అందరికీ చూపించబోతున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కానుంది’ అని అన్నారు.

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. ‘రాచరికం సినిమాను చాలా ప్రొఫెషనల్‌గా తీశారు. కొత్త టీం తీసిన సినిమాలా అనిపించలేదు. చాలా పెద్ద చిత్రం కాబోతోంది. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అతనే నాకు దారి చూపించాడు. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. చాలా పెద్ద హిట్ కానుంది’ అని అన్నారు.

నాగ్ అశ్విన్ మదర్ జయంతి మాట్లాడుతూ.. ‘రాచరికం మూవీ ప్రారంభం నుంచీ నాకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. ట్రైలర్, పాటలు చాలా బాగా వచ్చాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. జనవరి 31న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ.. ‘రాచరికం మూవీని సురేశ్ అద్భుతంగా తీశారు. ఈశ్వర్ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కించారు. వెంగి, రాహుల్ సిప్లిగంజ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారానే కెరీర్ స్టార్ట్ చేశారు. జనవరి 31న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

డీఓపీ ఆర్య సాయి మాట్లాడుతూ.. ‘రాచరికం చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేశ్, నిర్మాత ఈశ్వర్ గారికి థాంక్స్’ అని అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News