బ్రహ్మానందం చేతుల మీదుగా ‘పురుషోత్తముడు’ మోషన్ పోస్టర్ లాంచ్

Must Read

శ్రీ శ్రీదేవి ప్రోడక్షన్స్ బ్యానర్‌లో రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘పురుషోత్తముడు’. జోవియల్ స్టార్ రాజ్ తరుణ్, హాసిని హీరోహీరోయిన్లుగా నటించిన ‘పురుషోత్తముడు’ మోషన్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మానందం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రేక్షకులందరికీ నమస్కారం రమేష్ తేజావత్ నిర్మాణ సారధ్యంలో రామ్ భీమన దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం పురుషోత్తముడు. టైటిల్ చాలా బాగుంది కదూ. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జస్ట్ పోస్టర్ చూస్తుంటేనే సూపర్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా అద్భుతమైన విజయం సాదించాలని ఆ ఏడు కొండలవాడిని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ మూవీ రాజమండ్రిలో వేసిన భారీ సెట్లో టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని అలాగే హీరో రాజ్ తరుణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన భారీ చిత్రమిది సంగీత పరంగా కుడా పెద్ద హిట్ అవుతుంది అని చిత్ర దర్శకులు రామ్ భీమన అన్నారు.
ఇక అతి త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోందని నిర్మాతలు డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ వెల్లడించారు.

నటీనటులు:
రాజ్ తరుణ్, హాసిని సుధీర్ (నూతన పరిచయం), మురళి శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముఖేష్ ఖన్నా, రాజా రవీంద్ర, రాజ్ తిరన్ దాస్, అనంత్, సమీర్, సత్య, ప్రవీణ్, కవిత, విరాన్, సుభాష్, జ్వాల కోటి, రచ్చ రవి, నాగ భైరవ అరుణ్, ముక్తార్ ఖాన్, లక్ష్మణ్, కంచరపాలెం రాజు, హరిశ్చంద్ర.

*రచన & దర్శకుడు: రామ్ భీమన

  • నిర్మాతలు: DR.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బీవీ నారాయణరాజు (నాని),
  • గేయ రచయితలు: రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, పూర్ణాచారి
  • ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
  • సంగీత దర్శకుడు: గోపి సుందర్
  • సినిమాటోగ్రఫీ: PG విందా
  • ఫైట్ మాస్టర్ : జీవన్, రాజ్ కుమార్
  • కొరియోగ్రాఫర్: సుభాష్
  • పీఆర్‌ఓ : సురేష్ కొండేటి.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News