పైరసీని అరికట్టిన డీసీపీ కవిత బృందాన్ని అభినందించిన ప్రేమిస్తున్నా చిత్ర యూనిట్ !!!

Must Read

ఎప్పటినుండో సినీ పరిశ్రమను భూతంలో పట్టి పీడిస్తున్నది పైరసీ. ఈ పైరసీని అరికట్టే ప్రయత్నంలో డీసీపీ కవిత అండ్ టీమ్ అనేక సినిమాల పైరసీకి పాల్పడిన నేరస్తుడిని పట్టుకొని సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసారు.

ఈ సందర్భంగా ఐబిఎమ్ ప్రొడక్షన్స్ ప్రేమిస్తున్నా చిత్ర బృందం ప్రేత్యేకంగా కలిసి అభినందించారు. భవిషత్తులో కూడా ఇలాంటి పైరసీ సైబర్ నేరస్తుల నుండి సినిమా పరిశ్రమని రక్షించమని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రేమిస్తున్నా చిత్ర నిర్మాత పప్పుల కనకదుర్గారావు దర్శకుడు భాను నిర్వాహకులు మర్రి రవికుమార్, హీరో సాత్విక్ వర్మ, హీరోయిన్ ప్రీతి నేహా, ఎడిటర్ శిరీష్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ… “పైరసీ మహమ్మారి వలన చిత్ర నిర్మాతలు ఎంతో నష్టపోతున్నారని, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న నిర్మాత సినిమాను విడుదల చేసిన రోజు నుండే పైరసీ మహమ్మరితో ఎంతో నష్టపోతున్నారు, సైబర్ నేరగాళ్లను అరికట్టి చిత్ర పరిశ్రమను రక్షించాలని కోరారు.

ఈ సందర్భంగా డిసిపి కవిత మాట్లాడుతూ…
పైరసీ పట్ల ఎప్పటికి అప్పడు చిత్ర నిర్మాతలు అప్రమత్తమై సైబర్ క్రైమ్ అధికారులకు పిర్యాదు చెయ్యాలని కోరారు.

Latest News

గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన “రాజు వెడ్స్ రాంబాయి”, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్ జ్యూరీ సహా నాలుగు అవార్డ్స్ దక్కించుకున్న మూవీ

కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది "రాజు వెడ్స్ రాంబాయి". ఈ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీలోనూ సూపర్ హిట్...

More News