పాన్ ఇండియా చిత్రం మహా రాగ్ని – టీజర్

Must Read

చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో సంచలనం సృష్టిస్తున్న ప్రభుదేవా, కాజోల్, సంయుక్త మీనన్ పాన్ ఇండియా చిత్రం మహా రాగ్ని టీజర్

ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం మహారాగ్ని. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు నటిస్తునారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడులైంది.

టీజర్ మొదటి షార్ట్ నుంచి చివరి షాట్ వరకు అత్యంత ఉత్కంఠంగా రంజింపజేసింది. ఈ టీజర్ లో ముఖ్యంగా ప్రధాన క్యారెక్టర్ లను ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభుదేవా స్వాగ్, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. బ్యూటీ సంయుక్త మీనన్ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే నసీరుద్దీన్ షా క్యారెక్టర్ ను కూడా రివీల్ చేశారు. ఇక చివరిగా డైనమిక్ లేడీ, బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఎంట్రీనే అద్భుతంగా ఉంది. జాతరలో ఫైట్ చేసే సీన్, తాను చెప్పే డైలాగ్ గూజ్ బమ్స్ తెప్పిస్తున్నాయి. మహా రాగ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ టీజర్ అశేష ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.

ముఖ్యంగా టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. బాలీవుడ్ బాద్షా షారుఖాన్ నటించిన జవాన్ చిత్రానికి పనిచేసిన జీకే విష్ణు మహారాగ్ని చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఫ్రేమ్ లో ఆయన పనితనం గొప్పగా ఆవిష్కరించింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి వెన్నుముక అనేది టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. గూస్ బంప్స్ తెప్పించే బిజిఎం అందించాడు. టీజర్ కట్ చేసిన విధానం కూడా కట్టిపడేసింది. ఈ విషయంలో ఎడిటర్ నవీన్ నూలి పనితనం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆర్ట్ వర్క్ గురించి. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. కచ్చితంగా పాన్ ఇండియా ప్రేక్షకులు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరో బ్రహ్మాండమైన అప్డేట్ వెలువలనుందని సమాచారం.

నటీనటులు:కాజోల్, ప్రభుదేవ, నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు
కథ-దర్శకత్వం: చరణ్ తేజ్ ఉప్పలపాటి
స్క్రీన్ ప్లే: నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా
నిర్మాత: వెంకట అనిష్ దొరిగిల్లు
బ్యానర్: E7, బవెజ స్టూడియోస్
సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రాఫర్: జి కె విష్ణు
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
మార్కెటింగ్: సీజోన్ డిజిటల్ నెట్ వర్క్
పీఆర్ఓ: హరీష్, దినేష్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News