మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బెత్లెహెం కుడుంబ యూనిట్” ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీగా దర్శకుడు గిరీష్ ఎ డి రూపొందించారు. ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. నివిన్ పాలీ సరసన మమిత బైజు హీరోయిన్ గా నటించారు.
ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన “బెత్లెహెం కుడుంబ యూనిట్” సినిమాకు మంచి టాక్ రావడంతో టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. బుక్ మై షో లో గంటకు దాదాపు 25 వేల టికెట్ బుకింగ్స్ జరుగుతుండటం విశేషం. ఈ చిత్రంలో జస్టిన్ పాత్రలో నివిన్ పాలీ సాలిడ్ పర్ ఫార్మెన్స్ కు ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కుతున్నాయి. గతేడాది సర్వంమాయతో హిట్ కొట్టిన నివిన్ పాలీ ఈ ఏడాది “బెత్లెహెం కుడుంబ యూనిట్”తో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఈ ఓనం పండుగ సూపర్ హిట్ గా క్రిటిక్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలోని కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్…
మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను గబ్బర్ సింగ్ టీమ్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి గారి నివాసంలో…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషార్ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్గా శ్రీధరవర్మ బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి సమీపంలోని…
▪️ ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్కేర్’▪️ మధురైలో ‘కలర్స్ 2.0’ నూతన బ్రాంచ్ ఏర్పాటు▪️ బరువు…
హనీ క్రియేషన్స్ సమర్పణలో హీరోలు శ్రీ, రాజువర, హీరోయిన్ శృతి శంకర్, నటులు అప్పారావు, రైజింగ్ రాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న…