‘మిస్టర్ రెడ్డి’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో, నిర్మాత టీఎన్ఆర్

Must Read

టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహా రెడ్డి-టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. ఈ చిత్రానికి వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్‌తో పాటుగా.. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూలై 18న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హీరో, నిర్మాత టీఎన్‌ఆర్ మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’కి సపోర్ట్ చేస్తున్న మీడియాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎంతో తపన ఉంటేనే సినిమాలు నిర్మిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడితే గానీ ఓ మూవీ బయటకు రాదు. ఈ క్రమంలో నన్ను ఎంతో మంది మోసం చేశారు. కానీ నేను ఎప్పుడూ ఎక్కడా భయపడలేదు. నా టాలెంట్‌ను నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాను. ఇది నా జీవితంలో జరిగిన కథే. ఇందులోని ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం జూలై 18న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు వెంకట్ వోలాద్రి మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’ లాంటి మంచి చిత్రాన్ని తీశాం. ఈ ప్రయాణంలో మాకు నిర్మాత, హీరో టీఎన్‌ఆర్ గారు ఎంతో సహకరించారు. మహదేవ్, అనుపమ, దీప్తి అందరూ అద్భుతంగా నటించారు. నాగ భూషణ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. టీం అంతా కూడా నా స్నేహితులే. అందరం కలిసి ఈ మూవీని తీశాం. రాజన్న ఓ ఫైట్ సీక్వెన్స్‌ను బాగా తీశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

హీరో మహదేవ్ మాట్లాడుతూ .. ‘మా ‘మిస్టర్ రెడ్డి’ కోసం టీఎన్‌ఆర్ గారు ఎంతో కష్టపడ్డారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా టీఎన్‌ఆర్ గారికి ధన్యవాదాలు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ మూవీని అందరూ తప్పకుండా థియేటర్లోనే చూడండి. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మా చిత్రం జూలై 18న రాబోతోంది. అందరూ చూసి విజయవంతం చేయండి’ అని అన్నారు.

హీరోయిన్ అనుపమ ప్రకాష్ మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’ టీం అంతా ఓ కుటుంబంలా కలిసి పని చేశాం. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

హీరోయిన్ దీప్తి శ్రీరంగం మాట్లాడుతూ .. ‘ఇది నాకు తొలి సినిమా. నేను తెలుగమ్మాయిని. మేం చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మహదేవ్‌తో నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రం అందరినీ మెప్పించేలా ఉంటుంది’ అని అన్నారు.

కెమెరామెన్ నాగ భూషణ్ మాట్లాడుతూ .. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీఎన్‌ఆర్ గారికి థాంక్స్. ఈ చిత్రం బాగా వచ్చింది. అన్ని రకాల అంశాలు ఈ మూవీలో ఉంటాయి. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

నటీనటులు : టీఎన్ఆర్, మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి తదితరులు

సాంకేతిక బృందం
రచన, దర్శకత్వం : వెంకట్ రెడ్డి వోలాద్రి
నిర్మాత : టీఎన్ఆర్
కెమెరామెన్: కె ఎన్ భూషణ్
సంగీతం: కేఎస్ఆర్ మ్యూజికల్
కొరియోగ్రాఫర్: గోవింద్
ఫైట్స్: యాక్షన్ గౌరీ
పీఆర్వో : సాయి సతీష్

ఫైట్స్: యాక్షన్ గౌరీ
పీఆర్వో : సాయి సతీష్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News