మూవీ టైటిల్ ‘రాజు వెడ్స్ రాంబాయి’- టైటిల్ గ్లింప్స్ లాంచ్.

Must Read

‘నీది నాది ఒకే కథ’, విరాట పర్వం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాతగా మారి తన తొలి నిర్మాణ సంస్థను అనౌన్స్ చేశారు, రాహుల్ మోపిదేవితో కలిసి డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్‌పై సినిమాని నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈ చిత్రానికి మేకర్స్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఖమ్మం, వరంగల్ బోర్డర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా యదార్థ కథ ఆధారంగా తెరకెక్కింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడిన మూవీస్ ఎల్లప్పుడూ ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. రాజు వెడ్స్ రాంబాయి శాశ్వతమైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది.

టైటిల్ పోస్టర్‌లో హీరో డ్రమ్ వాయిస్తూ వుండగా అతని పక్కన తన ప్రేమికురాలిని ప్రజెంట్ చేస్తోంది. టైటిల్ గ్లింప్స్ అమ్మాయి ఈ డ్రమ్మర్‌తో ప్రేమలో పడిన యెనగంటి రాంబాయిగా తనను తాను పరిచయం చేసింది. అతను డ్రమ్స్ వాయించే విధానాన్ని ఆమె ఇష్టపడుతుంది. యెల్లందులోని బొగ్గు గనుల వంటి గ్రామంలో తన ప్రేమకథ పాపులర్ అని ఆమె చెబుతుంది. ఆమె తమ ప్రేమకథను తీన్‌మార్, దో మార్, నాగిని చెప్పడం ఆసక్తికరంగా వుంది.

టైటిల్, గ్లింప్స్ ప్రకారం రాజు వెడ్స్ రాంబాయి తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన గ్రామీణ ప్రేమకథ. వేణు ఊడుగుల సపోర్ట్ తో ఈ ప్రాజెక్ట్ మరపురాని అనుభూతిని అందించబోతోంది.

ఈ చిత్రానికి వాజిద్ బేగ్ డీవోపీ కాగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి నరేష్ అడుప ఎడిటర్ కాగా, సాహిత్యం మిట్టపల్లి సురేందర్ అందించారు. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్.

రాజు వెడ్స్ రాంబాయిని ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14, 2025న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన తారాగణం, ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

టైటిల్ గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్ లో నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. సాయిలు నాతో మూడేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ ప్రాంతంలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఒక కథ రాశానని చెప్పాడు. ఆ కథ విన్న తర్వాత నాకు ఒక ఎక్స్ట్రార్డినరీ ఫీలింగ్ కలిగింది. ఎక్సైట్మెంట్ వచ్చింది. కథలో ఉన్న ఎన్నో సెన్స్, కథ జరిగే ప్రాంతం, పాత్రలు, ఆ పాత్రల మధ్య సంఘర్షణ అన్ని నన్ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు. ఇంత వైవిధ్యమైనటువంటి ప్రేమ కథని నేనెప్పుడూ చూడలేదు వినలేదు. ఈ కథని సినిమాగా తీయాలని స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో ఈటీవీ విన్ వాళ్లతో షేర్ చేయడం జరిగింది. వాళ్లు కూడా కథ విని హ్యాపీగా ఫీలయ్యారు. ఈ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశాం. ఇది మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా వుంది’ అన్నారు.

ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ కథ. పాత్రలన్నీ చాలా సహజంగా వుంటాయి. ఇద్దరం కలసి ప్రొడ్యూస్ చేసి థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. సినిమా తప్పకుండా అందరినీ గొప్పగా అలరిస్తుంది’ అన్నారు.

ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ..థియేటర్స్ కి సత్తా వున్న కథని తీసుకెళ్దామని అనుకున్నాం, అందులో మేము చేస్తున్న మొదటి ప్రయత్నం రాజు వెడ్స్ రాంబాయి. ఈ కథ విన్నప్పుడే థియేటర్స్ సినిమా అనుకున్నాం. గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది’ అన్నారు.

సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
రచన, దర్శకత్వం: సాయిలు కంపాటి
బ్యానర్లు: ధోలముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్
ఎడిటింగ్: నరేష్ అడుప
ప్రొడక్షన్ డిజైన్: గాంధీ నడికుడికర్
సౌండ్ డిజైన్: ప్రదీప్ జి
సాహిత్యం: మెట్టపల్లి సురేందర్
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News