కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్గా ఈ మూవీని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో ఈ మూవీని శోభా కపూర్, ఏక్తా కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.
మైథలాజికల్, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్తో రాబోతోన్న ‘వృషభ’ చిత్రాన్ని టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ ముంబైలో ముగిసింది. ఇక షూటింగ్ పూర్తి అవ్వడంతో సెట్లో చిత్రయూనిట్ అంతా కూడా సందడి చేశారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేయనున్నారు.
విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ ఇలా అన్ని పనుల్ని ప్రారంభించబోతోన్నారు. ఈ మూవీని మలయాళం, తెలుగు భాషల్లో తెరకెక్కించారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.
లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా ఈ సినిమా ఉంటుందని మేకర్లు తెలిపారు. ప్రతీ ఒక్క సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయని అంటున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో మరుపురాని చిత్రంగా వృషభ నిలుస్తుందని మేకర్లు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. మున్ముందు మరింతగా ప్రమోషనల్ కంటెంట్ను వదిలి సినిమాపై ఆసక్తిని పెంచబోతోన్నారు. వృషభ జర్నీ ఇప్పుడే మొదలైందని, ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. అంతకు మించేలా ఉంటుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్…
‘లిటిల్హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా…
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…