నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టిల రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’… వరల్డ్ వైడ్గా ఆగస్ట్ 4న గ్రాండ్ రిలీజ్.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల
వైవిధ్యమైన పాత్రలో నటుడిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ప్రముఖ నిర్మాణ యువీ క్రియేషన్స్ బ్యానర్పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
యువీ క్రియేషన్స్ బ్యానర్లో ‘భాగమతి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అనుష్క నటిస్తోన్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ . సినిమా అనౌన్స్మెంట్ నుంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగినట్లు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ కాగా.. వాటికి ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అందులో ఓ పాటను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాడటం విశేషం. ఈ క్రమంలో తాజాగా సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క.. స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి పాత్రలు మనసులను హత్తుకునేలా రూపొందించారు. టీజర్ చూడగానే ఆ విషయం క్లియర్గా తెలిసిపోతుంది. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్ను గమనిస్తే.. అందులోనూ హీరో హీరోయిన్లు ఉన్నారు. ఓ ప్లెజంట్ ఫీలింగ్ ఇచ్చేలా పోస్టర్ ఉంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మెప్పంచటానికి ఆగస్ట్ 4న మన ముందుకు వచ్చేస్తుంది.
సంగీతం: రధన్
బ్యానర్: యువీ క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ – ప్రమోద్
రచన, దర్శకత్వం: మహేష్ బాబు.పి
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
కొరియోగ్రఫీ: రాజు సుందరం
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: రాఘవ్ తమ్మారెడ్డి
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…