మెగస్టార్ చిరంజీవి హిట్లర్ జనవరి 1న థియేటర్స్ లో గ్రాండ్ రీ రిలీజ్ !!!

Must Read

హిట్లర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని చెల్లెళ్ళ సెంటిమెంట్ కి కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు. అలాంటి చిత్రం నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రీరిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీత దర్శకుడు కోటి, కమెడియన్ బాబు మోహన్ హాజరయ్యారు. అదే విధంగా డైరెక్టర్ మోహన్ రాజా, యువ హీరో సత్యదేవ్ అతిథులుగా హాజరయ్యారు. ఎడిటర్ మోహన్ కూడా హిట్లర్ రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. 

ఎడిటర్ మోహన్ మాట్లాడుతూ.. హిట్లర్ తో పాటు మరో రెండు చిత్రాలని కూడా తాను రీ రిలీజ్ చేస్తానని మోహన్ తెలిపారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ చిత్రాలని కూడా రి రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. హిట్లర్ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించాలి అనుకున్నప్పుడు నేను డిసైడ్ అయింది చిరంజీవితోనే చేయాలి అని. చిరంజీవి తప్ప ఇంకెవరూ ఈ పాత్రకి న్యాయం చేయలేరు అని భావించినట్లు మోహన్ తెలిపారు. 

దర్శకుడు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం రావడం తన అదృష్టం అని తెలిపారు. హిట్లర్ సినిమా ప్రారంభానికి ముందే కొందరు ఫ్యాన్స్ నాకు లెటర్స్ రాశారు. సినిమా బాగా రావాలి.. ఏమైనా తేడా వస్తే ఊరుకోము అంటూ లెటర్స్ పంపారు. దేవుడా ఇదెక్కడి గొడవ అని అనుకున్నట్లు సుబ్బయ్య సరదాగా తెలిపారు. ఈ చిత్రంలో సెంటిమెంట్ సీన్లు, హాబీబి సాంగ్ అన్నీ విపరీతంగా నచ్చాయి. చివరికి సెంటిమెంట్ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అని సుబ్బయ్య గుర్తు చేసుకున్నారు. 

బాబు మోహన్ మాట్లాడుతూ.. ఎడిటర్ మోహన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక కథ ఎంచుకున్నారు అంటే అది తప్పకుండా హిట్ అవుతుంది. హిట్లర్ రీ రిలీజ్ అవుతున్నట్లు లేదు.. ఇప్పుడే ఫస్ట్ రిలీజ్ అవుతున్నట్లు హంగామా ఉంది. డ్యాన్స్ లో చిరు అన్నని మించిన వాళ్ళు లేరు. చిరంజీవి ఈ చిత్రంలో చాలా సింపుల్ కాస్ట్యూమ్స్ తో కనిపించారు. రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ఉంటారు. మరోసారి హిట్లర్ చిత్రం మీ అందరిని అలరిస్తుంది అని బాబు మోహన్ అన్నారు. 

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. మోహన్ రాజా సార్ నన్ను ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారు. నేను గెస్టుగా రాలేదు.. ఫ్యాన్ బాయ్ గా వచ్చాను అని తెలిపారు. నా చిన్నతనంలో హిట్లర్ చిత్రానికి మా అమ్మానాన్న నన్ను తీసుకెళ్లారు. ఇప్పుడు రీ రిలీజ్అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరిని నేను సినిమాకి తీసుకెళతా అని సత్యదేవ్ తెలిపారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News