కుటుంబ భావోద్వేగాలతో కూడిన చిత్రం లక్కీ భాస్కర్ మీనాక్షి చౌదరి

Must Read

అందరూ మెచ్చేలా లక్కీ భాస్కర్ చిత్రం ఉంటుంది : కథానాయిక మీనాక్షి చౌదరి

వైవిద్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక మీనాక్షి చౌదరి, చిత్ర విశేషాలను పంచుకున్నారు.

లక్కీ భాస్కర్ ప్రయాణం ఎలా సాగింది? సితార సంస్థలో పనిచేయడం ఎలా ఉంది?
గుంటూరు కారం తర్వాత సితార ఎంటెర్టైన్మెంట్స్ లో ఇది నా రెండో సినిమా. ఈ మంచి సినిమాలో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది. సితార సంస్థ నన్ను కుటుంబసభ్యురాలిలా చూస్తుంది. ఈ అవకాశమిచ్చిన చినబాబు గారికి, వంశీ గారికి కృతఙ్ఞతలు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి గారితో కలిసి లక్కీ భాస్కర్ చేయడం అనేది మంచి అనుభూతి. నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఇందులో ఎందరో యువ ప్రతిభావంతులు ఉన్నారు. బాగా ప్రిపేర్ అయ్యి ఈ సినిమాని ప్రారంభించడం గొప్ప విశేషం. అందువల్ల నాది, దుల్కర్ గారిది తెలుగు మాతృభాష కానప్పటికీ మేము ఒక్కరోజు కూడా ఇబ్బందిపడలేదు. దుల్కర్ సల్మాన్ గారు గొప్ప నటుడు. అలాగే మంచి మనిషి. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.

మధ్యతరగతి భార్యగా, తల్లిగా ఈ సినిమాలో నటించారు.. పాత్ర కోసం ఏమైనా హోంవర్క్ చేశారా?
డబ్బు కారణంగా మధ్యతరగతి మనిషి జీవితంలో, అతని కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దాని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేను మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయాను. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర ప్రేక్షకులకు చేరువవుతుందనే నమ్మకం ఉంది.

కెరీర్ స్టార్టింగ్ లో తల్లి పాత్ర చేయడం రిస్క్ అనిపించలేదా?
మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే మంచి కథలు చేయాలి, మంచి టీంతో పని చేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే పరిమితిని నటులు పెట్టుకోకూడదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటీనటులకు కాదు, ప్రేక్షకులకు కూడా బోర్ కూడా కొడుతుంది. అందుకే నటిగా పాత్రల ఎంపికలో వైవిద్యం చూపించాలని అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగానే సినిమాలను ఎంచుకుంటున్నాను.

సుమతి పాత్ర ఎలా ఉండబోతుంది?
భాస్కర్ దగ్గర ఏమీ లేనప్పుడు తనని తనగా ఇష్టపడుతుంది సుమతి. ప్రేమను పంచే కుటుంబం, బ్రతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలు అనుకునే స్వభావం తనది. అయితే దురాశ, డబ్బు కారణంగా భాస్కర్-సుమతి మధ్య ఏం జరిగింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని, మరిన్ని మంచి కథలు వస్తాయని భావిస్తున్నాను.

కథ విన్న తర్వాత మొదట మీకు ఏమనిపించింది?
బ్యాంకింగ్ నేపథ్యంలో కొన్ని సిరీస్ లు వచ్చాయి. కానీ కుటుంబ భావోద్వేగాలను ముడిపెడుతూ వెంకీ అట్లూరి గారు ఈ కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది. ఎమోషన్స్ తో కూడిన ఒక బ్యూటిఫుల్ జర్నీ ఈ మూవీ. అలాగే నా పాత్ర కూడా నాకు బాగా నచ్చింది.

చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ గురించి?
నేను చూసిన ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ లలో రిత్విక్ ఒకడు. ఎంతో ప్రతిభ ఉంది. డైలాగ్ లు మర్చిపోకుండా చెబుతాడు. ఎక్స్ ప్రెషన్స్ కరెక్ట్ గా ఇస్తాడు. అతనికి ఎంతో మంచి భవిష్యత్ ఉంది.

ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి కదా.. దీనిపై మీ స్పందన?
ఇది కథా బలమున్న సినిమా. అందుకే సినిమాపై ముందు నుంచి మేమందరం ఎంతో నమ్మకంగా ఉన్నాము. ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి మా నిజమవుతుందని ఆనందం కలిగింది.

సాంకేతికంగా సినిమా ఎలా ఉండబోతుంది?
సాంకేతిక విభాగం అద్భుతంగా పనిచేసి సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. జి.వి. ప్రకాష్ గారు సంగీతం చాలా బాగుంటుంది. అలాగే కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ ప్రతిదీ అద్భుతంగా ఉంటాయి.

దుల్కర్ సల్మాన్ గురించి?
ఆయన ఎంత గొప్ప నటుడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా అద్భుతంగా నటించారు. భాస్కర్ పాత్రకు ఏం కావాలో అది చేసి, కథని భుజాలపై నడిపించారు. అలాగే తెలుగు మాతృభాష కానప్పటికీ, సంభాషణలు నేర్చుకొని చక్కగా చెప్పారు. మమ్మూట్టి గారి కొడుకు అయినప్పటికీ విభిన్న పాత్రలు ఎంచుకుంటూ, తనదైన నటనతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోతారు దుల్కర్ గారు. భాస్కర్ పాత్రలో కూడా అలాగే ఒదిగిపోయారు.

లక్కీ భాస్కర్ ఎలా ఉండబోతుంది?
ఎమోషన్స్ బాగుంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరికి సినిమా కనెక్ట్ అవుతుంది. ఇదొక కామన్ మ్యాన్ కథ. అందరికీ నచ్చుతుంది.

తదుపరి సినిమాలు?
మట్కా, మెకానిక్ రాకీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి గారి సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News