దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై సోషల్ మీడియాలో యాంకర్ గౌతమి ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో చూస్తే అక్కడి వాతావరణం, ఆ ఘాట్ స్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో వచ్చిన కొన్ని గంటల్లో ‘రా కింగ్’ మనోజ్ మంచు స్పందించి.. స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని మనోజ్ ఇలా చాటుకున్నారు. .
ఈ ఘటనపై సోషల్ మీడియాలో మనోజ్ మంచు స్పందిస్తూ.. ‘‘దాసరి గారి ఘాట్ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి నిజంగా చాలా బాధ కలిగింది. దాసరి నారాయణరావు గారు తరతరాలకు స్ఫూర్తినిచ్చి, తెలుగు సినిమాకు ఎంతో దోహదపడ్డారు. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. నా వంతుగా నేను చేయగలిగి సహాయం చేస్తానని హామీ ఇస్తున్నాను’ అని ట్వీట్ వేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మనోజ్ తన సినిమా షూటింగ్కి వెళ్లే కంటే ముందు ఉదయం 7:00 గంటలకల్లా తన బృంద సభ్యులతో కలిసి దాసరి ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మూడు, నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడకు వచ్చాను. ప్రస్తుతం ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్ని చూసి చాలా బాధపడ్డాను. చిత్రపురి కాలనీ దాటుతుండగా, ఆయన విగ్రహం కనిపించి ఘాట్ గుర్తొచ్చింది. ఆ వీడియా మా టీం నాకు చూపించడంతో అసలు విషయం తెలిసింది. ఆ దృశ్యాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నేను తట్టుకోలేకపోయాను. అందుకే దీనికి ప్రాధాన్యతనిచ్చి, నా షూటింగ్కు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు.
ఆ తర్వాత మనోజ్ తన టీంతో కలిసి ఘాట్ చుట్టూ పేరుకుపోయిన ఎండుటాకులు, చెత్తను తొలగిస్తూ ఘాట్ ప్రాంతమంతటినీ శుభ్రం చేశారు. మనోజ్, మౌనికా ఇటీవల ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అనే సామాజిక సేవా ఉద్యమం వెనుక ఉన్న ఉన్నత స్ఫూర్తిని ఈ చర్య ప్రతిబింబిస్తుంది. ఈ మధ్య మనోజ్ రక్తదాన శిబిరాలు, సహాయ కార్యక్రమాలు, మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించడం అందరికీ తెలిసిందే. ఐక్య ధైర్య సేన సమితి ద్వారా వాయిస్ లెస్కి వాయిస్గా నిలుస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు మనోజ్ మంచు. ఇప్పుడు మనోజ్ దాసరి నారాయణరావు గారి ఘాట్ని సందర్శించడం ఆయన నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుంది.
ఆగస్టు 16, హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం అయిన ఈశా గ్రామోత్సవం 2026 - తెలంగాణ ఎడిషన్లో రాష్ట్రవ్యాప్తంగా…
వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న" దొరికిందా" చిత్రం నేడు హైదరాబాద్…
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగే…
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన…
‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః ’ పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , ఆస్కార్ అవార్డు…
క్రియేటివ్ లాంచ్ప్యాడ్ బ్యానర్పై తెరకెక్కుతున్న కొత్త చిత్రం “డెలులు”. యూత్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న “డెలులు” అనే పదాన్ని టైటిల్గా…