కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 ఘనంగా నిర్వహణ

తెలుగు చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించిన కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించేందుకు నిర్వహించిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026” కార్యక్రమం హైదరాబాద్‌లోని AAA సినిమాస్, అమీర్‌పేట్‌లో ఘనంగా జరిగింది. సినీ, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి స్మారకార్థం నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలో పలువురు సినీ ప్రముఖులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్ భరత్ భూషణ్ గారు, APFDC డైరెక్టర్ మరియు ప్రముఖ నిర్మాత చడలవాడ శ్రీనివాస్ రావు గారు, ఎన్టీఆర్ గారి తనయుడు మరియు ప్రముఖ కొరియోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ గారు, TFPC కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ గారు, నిర్మాత పుష్కూర్ రామ్ మోహన్ రావు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ నటి ప్రశాంతి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అలాగే దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వేడుకలో కళావేదిక ఎన్టీఆర్ స్మారక కళారత్న అవార్డును ప్రముఖ నిర్మాత చడలవాడ శ్రీనివాస్ రావు గారికి అందజేశారు. అలాగే కళావేదిక ఎన్టీఆర్ సేవారత్న అవార్డులను శ్రీమతి ఉప్పల స్వప్న గారు, డాక్టర్ అంచుల పవన్ కుమార్ గారికి ప్రదానం చేశారు.

సినీ విభాగంలో ఉత్తమ నటుడిగా ఆది సాయికుమార్, ఉత్తమ వైవిధ్య నటుడిగా ప్రియదర్శి, ఉత్తమ నటిగా శివాని నాగారం, జ్యూరీ ఉత్తమ నటిగా ఆనంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ఎంపిక కాగా, ఉత్తమ నిర్మాతలుగా పుష్కూర్ రామ్ మోహన్ రావు మరియు సునీల్ నారంగ్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా లయ సత్కారం పొందారు.

ఈ అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యులుగా దర్శకుడు సాయి రాజేష్, శైలేష్ కొలను, పద్మావతి మల్లాది, అనుపమ్ రెడ్డి, నందమూరి సీమంతిని, నందమూరి రూప పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ గారిపై ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, స్మారక వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినీ ప్రముఖులు మాట్లాడుతూ కళావేదిక నిర్వహిస్తున్న ఈ అవార్డులు తెలుగు సినీ పరిశ్రమకు గౌరవాన్ని తీసుకువస్తున్నాయని అభినందించారు.

ఈ వేడుకను కళావేదిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా, సినీ అభిమానులు, ఆహ్వానితులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 విజేతల జాబితా

🔹 ఉత్తమ నటుడు – ఆది సాయికుమార్
🔹 ఉత్తమ వైవిధ్య నటుడు – ప్రియదర్శి

🔹 ఉత్తమ నటి – శివాని నాగారం
🔹 జ్యూరీ ఉత్తమ నటి – ఆనంది

🔹 ఉత్తమ దర్శకుడు – రాహుల్ రవీంద్రన్

🔹 ఉత్తమ నిర్మాతలు – పుష్కూర్ రామ్ మోహన్ రావు, సునీల్ నారంగ్

🔹 ఉత్తమ సహాయ నటి – లయ

🔹 ఉత్తమ బాలనటి – సుకృతి

🔹 ఉత్తమ సంభాషణ రచయిత – ప్రసన్న కుమార్ బెజవాడ

🔹 ఉత్తమ సంగీత దర్శకుడు & రీ-రికార్డింగ్ – సురేష్ బొబ్బిలి

🔹 ఉత్తమ నేపథ్య గాయకుడు – శ్రీకృష్ణ

🔹 జ్యూరీ ఉత్తమ నేపథ్య గాయకుడు – యాజిన్ నిజార్

🔹 ఉత్తమ నేపథ్య గాయనీ – సమీరా భరద్వాజ్

🔹 ఉత్తమ గేయ రచయిత – నాగ గురునాథ శర్మ

🔹 ఉత్తమ ఛాయాగ్రాహకుడు – సతీష్ మాసం

🔹 ఉత్తమ లెజెండరీ కమెడియన్ అవార్డు – ఆలీ

🔹 ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ – మనీషా దత్

🔹 ఉత్తమ కొరియోగ్రాఫర్లు – ఆట సందీప్ & జ్యోతి రాజ్

🔹 ఉత్తమ ఆడియో స్టూడియో – SAS శ్రీ అభేరి స్టూడియోస్

🔹 ఉత్తమ ఎగ్జిబిటర్ అవార్డు – తుమ్మల రామబ్రహ్మం చౌదరి

🔹 ఉత్తమ ప్రీమియం మల్టీప్లెక్స్ అవార్డు – AAA సినిమాస్
(జాన్వి నారంగ్ ఆధ్వర్యంలో)

🔹 ఫిల్మ్ స్ట్రాటజిస్ట్ ఆఫ్ ది ఇయర్ – వంశీ నందిపాటి

🔹 ఉత్తమ PRO – తేజస్వి సజ్జా

🔹 కళావేదిక ఎన్టీఆర్ యంగ్ టాలెంట్ అవార్డు (చైల్డ్ ఆర్ట్స్) – కుమారి ప్రణతి పాంపన

🔹 జ్యూరీ ఉత్తమ దర్శకుడు – నవనీత్ శ్రీరామ్

🔹 ఉత్తమ తొలి దర్శకుడు – సాయి మార్తాండ్

🔹 ఉత్తమ తొలి కమెడియన్ – జై కృష్ణ

🔹 ఉత్తమ తొలి సహాయ నటుడు – నరేంద్ర రవి

🔹 ఉత్తమ తొలి ఛాయాగ్రాహకుడు (DOP) – సూర్య బాలాజీ

🔹 ఉత్తమ యాడ్ ఫిల్మ్ దర్శకుడు – జి. సూర్య తేజ

🔹 ఉత్తమ డిజిటల్ మీడియా అవార్డు – శ్రీ శ్రీనివాస్ వోడెనాల

TFJA

Recent Posts

‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…

20 hours ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…

20 hours ago

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

5 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago