మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి ,రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని సత్యసాయి కల్యాణమండపం లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
చిత్ర దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారు. వారికి నా ధన్యవాదాలు. హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు లు వచ్చి మమ్మల్ని బ్లేస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి.ఈ సినిమాకు అందరూ కొత్త వారైనా చాలా మంది సీనియర్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నందున ఈ సినిమా కొత్త వారు తీసినట్టు ఉండదు. ఈ నెల 17 నుండి చీరాలలో మొదటి షెడ్యూల్ జరుపుకొని హైదరాబాద్ లో జరిగే రెండవ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేసుకొంటామని అన్నారు.
చిత్ర నిర్మాత వి.శ్రీనివాస రావ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మేము పిలవంగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు గార్లకు ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా.దర్శకుడు వెంకటేష్ గారు చెప్పిన కథ నచ్చడంతో మహీంద్ర పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాను. ప్రేక్షకులందరికి నచ్చేవిధమైన అన్ని అంశాలతో వస్తున్న ఈ సినిమా మా బ్యానర్ కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
చిత్ర హీరో చైతన్య పసుపులేటి మాట్లాడుతూ.. ఇది నా మూడవ సినిమా వెంకటేష్ గారు నా మెదటి సినిమా నుండి తెలుసు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.మంచి టీం, మంచి కథతో తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర హీరోయిన్ రితిక చక్రవర్తి మాట్లాడుతూ..బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది సినిమాలో హీరోయిన్ గా నటించాను. ఆ సినిమా నాకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత విజయదేవరకొండ “ఖుషి” సినిమాలో, అనంత సినిమాలలో హీరోయిన్ సినిమాలలో నటిస్తున్న నాకు సస్పెన్సు థ్రిల్లర్ వంటి మంచి కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
కెమెరామెన్ సుధాకర్ మాట్లాడుతూ..కెమెరామెన్ గా నాకిది ఐదవ సినిమా.విజయ దశమి సందర్బంగా ఈ మూవీ ఓపెనింగ్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ స్వరూప్ – హర్ష లు మాట్లాడుతూ..ఈ సినిమాకు మంచి సాహిత్యం తో కూడిన అద్భుతమైన మెలోడీ పాటలు అందిస్తున్నాము..ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ విజయదశిమి రోజు ఈ సినిమా ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు
నటీ నటులు
చైతన్య పసుపులేటి ,రితిక చక్రవర్తి, శివకుమార్ రామచంద్ర వరపు, కరణ్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : మహీంద్ర పిక్చర్స్
నిర్మాత : వి.శ్రీనివాస రావ్
తమిళ్ ప్రెజెంటర్ : సాయి కార్తిక్ గౌడ్, జాడి
రైటర్ & డైరెక్టర్ : చిన్న వెంకటేష్ ,
డి. ఓ. పి: సుధాకర్ అక్కిన పల్లి
సంగీతం స్వరూప్ – హర్ష
పి. ఆర్ ఓ : మధు వి. ఆర్
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్…
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…