చిత్ర సీమకి భూషణ్ కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. దేశంలోని అపారమైన ప్రతిభను గుర్తించి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. నాన్ ఫిల్మ్ హిందీ సాంగ్ ‘ఓ పరి’ ద్వారా ఈసారి అద్భుతమైన ప్రతిభావంతుడు సౌత్కు చెందిన గొప్ప టెక్నీషియన్ డి.ఎస్.పి అలియాస్ దేవిశ్రీ ప్రసాద్ను మన ముందుకు సరికొత్తగా తీసుకొచ్చారు. రీసెంట్గా ఆ సాంగ్ను రిలీజ్ చేశారు.
గొప్ప ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగిన ఇద్దరు కలిసి హిందీ నాన్ ఫిల్మ్ వీడియో సాంగ్ కోసం కలిశారు. వారెవరో కాదు.. ఒకరేమో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, మరొకరు రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్. ఈ పాటను ప్రీమియర్ చేయటమే కాకుండా, ఓ పరి సాంగ్లో సిగ్నేచర్ స్టెప్తో స్టేజ్పై దుమ్మ రేపారు. వారిద్దరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ వేదికనే కాదు.. ఆ ప్రాంగణాన్నే ఊపేసింది. డిఎస్పి హుక్ స్టెప్తో ఆకట్టుకోగా, రణ్వీర్ సింగ్ పాటను పాడి మెప్పించారు.
‘ఓ పరి’ సాంగ్ ఓ ట్రాక్ మాత్రమే కాదు.. మ్యూజిక్ మ్యాస్ట్రో భూషణ్ కుమార్.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మధ్య ఇదొక మెగా కొలాబ్రేషన్. త్వరలోనే ఈ పాటను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. డిఎస్పి చేసిన తొలి నాన్ ఫిల్మ్ హిందీ సాంగ్ ఓపరి.. దీంతో ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ తెలియని ఆసక్తి క్రియేట్ అయ్యింది.
ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘‘నాన్ ఫిల్మ్ హిందీ మ్యూజిక్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అలాంటి నాకు భూషణ్ కుమార్ కంటే గొప్ప కొలబ్రేషన్ ఎవరుంటారు. చాలా హార్డ్ వర్క్, ప్యాషన్, ప్రేమతో చేసిన సాంగ్ ‘ఓపరి’. ఈ సాంగ్తో ఇది వరకంటే ఎక్కువ ప్రేమను ఆడియెన్స్ నాపై చూపిస్తారని భావిస్తున్నాను. అలాగే రణ్వీర్ సింగ్ కూడా చాలా గొప్ప వ్యక్తిత్వమున్నవాడు. మా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తను అందించిన సపోర్ట్కి నేను తనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీని కంటే ఎగ్జయింట్ ప్రాజెక్ట్స్తో భవిష్యత్తులో ప్రేక్షకులను మెప్పిస్తానని తెలియజేసుకుంటున్నాను. నా అమ్మగారు తొలిసారి ఈ సాంగ్ రిలీజ్ కోసం ముంబైకి వచ్చారు. నా ఫస్ట్ మ్యూజిక్ వీడియోను మా అమ్మగారి సమక్షంలో విడుదల చేయాలని కలగన్నాను’’ అన్నారు. స్టేజ్ పైకి డిఎస్పి తన తల్లిని పిలిచి అందరికీ పరిచయం చేశారు.
రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ ‘‘రాక్స్టార్ డిఎస్పి సాంగ్ను విడుదల చేయటాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదొక గొప్ప అనుభూతి. ఆ అనుభూతి ఈ మ్యూజిక్లోనూ కనిపిస్తంఓది. ఈ సాంగ్లోని హుక్ స్టెప్ నాకు బాగా నచ్చింది. బీట్ కూడా చాలా క్యాచీగా, అద్బుతంగా ఉంది’’ అన్నారు.
భూషణ్ కుమార్ మాట్లాడుతూ ‘‘డిఎస్పి నిజమైన ప్రతి విషయంలోనూ నిజమైన రాక్స్టార్. ఆయన సంగీతాన్ని ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాన్ ఫిల్మ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అతను ప్రవేశించడానికి ఇదే సరైన సమయంగా నాకు అనిపిస్తుంది. అతనితో కలిసి పనిచేయటం మరచిపోలేని అనుభూతి. ఓపరి సాంగ్ వినగానే ప్రేక్షకులకు నచ్చేస్తుంది. ఇలాంటి సింగిల్ ట్రాక్స్ను అద్భుతమైన రెస్పాన్స్ రావటమనేది ఇండియన్ మ్యూజిక్ రంగానికి గొప్ప సమయంగా చెప్పొచ్చు. అలాంటి థండర్ రెస్పాన్స్ ఈ పాటకు వస్తుందనే నమ్మకం నాకుంది’’ అన్నారు.
ఈ పెప్పీ సింగిల్ విన్నప్పుడు దాన్ని రూపొందించిన ప్రతి ఒక్కరినీ మనం గుర్తిస్తాం. ఇప్పుడు విడుదలైన పాటతో, ఈ ట్రాక్ స్మాష్ హిట్ కంటే ఇది తక్కువ కాదని మేం గట్టిగా చెప్పగలం. మీ ప్లే లిస్టులోని పాటలన్నింటిలో మించేలా ఓపరి సాంగ్ ఉంటుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తనే నిర్మిస్తూ డైరెక్ట్ చేసిన తొలి హిందీ పాట ‘ఓపరి’ని టీ సిరీస్ యూ ట్యూబ్ ఛానెల్లో గమనించవచ్చు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…