పెళ్ళిసందడి సినిమాలోని ” మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ” పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. వేటూరి రచన, కీరవాణి సంగీతంలో చిత్ర పాడగా అప్పట్లో రాఘవేంద్ర రావు అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటి హీరోయిన్ రవళి అందంతో పాటు తన అభినయాన్ని కూడా అద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఇదే పాటను మళ్ళీ వర్ధమాన నటి రేఖా భోజ్ రీ-క్రియేట్ చేశారు.
అంతేకాకుండా ఈ కవర్ సాంగ్ ని రాఘవేంద్ర రావు చేతుల మీదుగానే లాంఛ్ చేయగా యూట్యూబ్ లో విడుదల అయ్యింది. ఆ పాత పాట ఫ్లేవర్ ఎక్కడా పోకుండా చాలా అందంగా చిత్రీకరించిన ఈ పాటలో నటి రేఖా భోజ్ అభినయం, అందం హైలైట్ గా నిలిచాయని నెటిజన్స్ అంటున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. మీరూ ఓ లుక్కేయండి మరి
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు,…
'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే…
హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే…
అపోలో హాస్పిటల్స్ భారతదేశంలో తన 76వ ఆసుపత్రిని ప్రారంభించింది. హైదరాబాద్లో సాంకేతికంగా అధునాతనమైన ఈ ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆవిష్కరించింది.…
స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా…