జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ పెదమల్లు తొలి దర్శకునిగా పరిచయం అవుతూ ప్రారంభమైన చిత్రం #LUB. ఈ చిత్రం ద్వారా పవన్ కేసరి, ప్రాముఖ్య హీరో హీరోయిన్ గా పరిచయం అవుతుండగా అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, సాయికిరణ్, రోమాంచకం ఫేమ్ మధు, విశ్వనాథ్ & సన్స్ ఫేమ్ హారిక, భాను ప్రకాష్ కడియాల, మోత రాజేందర్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అక్షయ్ వసూరి డిఓపిగా పని చేస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ రోహిణి ఎడిటర్ గా, సుధ శ్రీనివాస్ సంగీత దర్శకుడిగా, లిరికల్ రైటర్ గా జైలర్ 2, ఓజి ఫేమ్ శ్రీనివాస మౌళి పని చేయనున్నారు. ప్రముఖ రచయిత బివిఎస్ రవి ఈ చిత్రానికి క్లాప్ చేయగా హనుమాన్ చిత్ర నిర్మాత చైతన్య రెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్ చిత్ర దర్శకుడు మణికంఠ దర్శకత్వం చేయగా స్క్రిప్టును క్రేజీ కల్యాణం చిత్ర నిర్మాత బి జగన్ మోహన్ రెడ్డి గారు, బివిఎస్ రవి గారు అందజేశారు. ఈ ఈవెంట్ కు హాజరైన సంబరాల ఏటిగట్టు చిత్ర దర్శకుడు రోహిత్ కెపి, దర్శకుడు సముద్ర, నిర్మాతలు లగడపాటి శ్రీనివాసరావు, శ్రీకాంత్ ఈ చిత్ర యూనిట్ కు తమ బెస్ట్ విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా నటుడు పవన్ కేసరి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులకు, మీడియా వారికి ధన్యవాదాలు. జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ పై రానున్న #LUB చిత్రం రోమ్ కోమ్, కామెడీ, లవ్ తో కూడిన ఎమోషన్ ఉన్న చిత్రం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం పని చేస్తున్న నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. చాలా మంచి కథతో మేము ఈ సినిమా మొదలుపెట్టాము. ఈ సినిమా కోసం కష్టపడి పని చేస్తాము” అన్నారు .
నటి ప్రాముఖ్య మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. మా చిత్రానికి సపోర్ట్ చేస్తే ఇక్కడికి వచ్చిన అందరికి థాంక్స్. ఇది నా తొలి చిత్రం. నా ఆడిషన్ చూసి నాకు చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకులకు, నిర్మాతలకు థాంక్స్. సినిమాలో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. సినిమా టీం అంతా కొత్త వారే. చిత్ర బృందం అందరితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… “మేము ఒక మంచి కథతో సినిమా చేయాలి అనే ప్యాషన్ తో చిత్ర పరిశ్రమకు వచ్చాము. మాకు సపోర్ట్ గా నిలిచిన మా దర్శకుడు, హీరోకు థాంక్స్. వారు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. మంచి కంటెంట్ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాము. కొత్తవారితో మరిన్ని ప్రాజెక్ట్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నాము. మా హీరోయిన్ బాల నటిగా ఇప్పటికే కొన్ని సినిమాలలో చేశారు. ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం పని చేస్తున్న అందరికీ ధన్యవాదాలు” అన్నారు.
చిత్ర దర్శకుడు మణికంఠ మాట్లాడుతూ… “మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు. ఈ సినిమా ఎమోషన్స్ తో ఒక రొమాంటిక్ డ్రామాగా ఉండబోతుంది. సినిమాకు సపోర్ట్ మీడియా వారికి, పిఆర్ఓ మధు గారికి థాంక్స్” అన్నారు.
అలాగే చిత్ర బృందం అందరూ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చి తమకు సపోర్ట్ చేసిన అతిధులకు, మీడియా వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపి తమ సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని, ఒక మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని తెలిపారు.
నటీనటులు : పవన్ కేసరి, ప్రాముఖ్య, అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, భాను ప్రకాష్ కడియాల, సాయికిరణ్, రోమాంచకం ఫేమ్ మధు, విశ్వనాథ్ & సన్స్ ఫేమ్ హారిక, మోత రాజేందర్ తదితరులు.
సాంకేతిక బృందం :
బ్యానర్స్ : జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్
దర్శకుడు : మణికంఠ పెదమల్లు
నిర్మాతలు :మహేష్ కుమార్ సంక, భగవాన్ (సంక బ్రోస్)
సహ నిర్మాతలు : పవన్ సుత సంక, రామతులసి సంక
డిఓపి : అక్షయ్ వసూరి
క్రియేటివ్ డైరెక్టర్ : భరత్ ఆకుల
సంగీత దర్శకుడు : సుధ శ్రీనివాస్
ఎడిటర్ : కార్తికేయన్ రోహిణి
లిరిక్స్ రైటర్ : శ్రీనివాస మౌళి
కొరియోగ్రాఫర్ : ఈశ్వర్ పెంటి
ఆర్ట్ డైరెక్టర్ : కార్తీక్ ఆకవరం
ఎక్జిక్యూటివ్ నిర్మాత : ఐజి సంతోష్
రైటర్స్ టీం : విజయ్, నాగేంద్ర, అఖిల్, కేశవ్, భరద్వాజ్ చిలుకూరు
డైరెక్షన్ టీమ్ : శివ సిహెచ్, అఖిల్
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s'…
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…