టాలెంటెడ్ హీరో లెజెండ్ శరవణన్ “లీడర్” సినిమా గ్లింప్స్ రిలీజ్, ఏప్రిల్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

Must Read

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “లీడర్”. ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. “లీడర్” సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో వచ్చిన “లీడర్” గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే – విలన్ కు చెందిన 9 కంటెయినర్లు కనిపించకుండా పోతాయి. ఆ కంటెయినర్స్ కోసం విలన్ అనుచరులు వెతుకుతుంటారు. ఒక చోట 9 కంటెయినర్లు కనిపిస్తాయి. కానీ ఆ కంటెయినర్స్ డ్రైవర్స్, రౌడీలు చనిపోయి ఉంటారు. వాళ్లను వెతుక్కుంటూ వచ్చిన రౌడీలను కూడా హీరో మట్టుబెడతాడు. ఎవరు చంపారని ఆరా తీస్తే అక్కడ ఉన్న అమ్మాయి వాళ్ల నాన్న అని తెలుస్తుంది. ఏరా నువ్వు హీరోవా అని విలన్ ఫోన్ చేసి అడిగితే, అవును హీరోనేరా ఏ బిడ్డకైనా తండ్రే హీరోరా అనే డైలాగ్ తో గ్లింప్స్ ఆకట్టుకుంది.

ఈ సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ – కొన్ని అనుకోని పరిస్థితుల్లో అండర్ వరల్డ్ మాఫియా, పోలీసుల ఫోర్స్ మధ్య చిక్కుకున్న ఓ సాధారణ వ్యక్తి కథ ఇది. ఈ రెండు వర్గాల సంఘర్షణ మధ్య తనని తాను రక్షించుకుంటూ ఈ సాధారణ వ్యక్తి ఎలా బయటపడ్డాడు అనేది ఆద్యంత ఆసక్తికరంగా ఈ సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు. అని తెలిపారు.

కోడి, పట్టాస్, గరుడన్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ “లీడర్” చిత్రాన్ని ఒక మంచి ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జైపూర్, ఊటీ, జార్జియా, చెన్నై వంటి లొకేషన్స్ లో మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను విడుదల చేయబోతున్నారు.

నటీనటులు – పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్, ఐశ్వర్య, అరంతంగి నిశా, ఐయాల్, జయమిశ్రా, పత్మాన్, యోగిరామ్, ఓక్ సుందర్, మహానది శంకర్, మరియమ్ జార్జ్, ఆదిత్య కతియార్, వేల్ అరుణాచలం, నిరంజన్, శోభన్ బాబు, అశోక్ పాండియన్, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దీప్తి ఆర్.జి, పూర్తి ప్రవీణ్
ఆర్ట్ డైరెక్షన్ – జి.దురైరాజ్
స్టంట్స్ – మహేశ్ మాథ్యూ
ఎడిటింగ్ – ప్రదీప్ ఇ.రాఘవ్
సినిమాటోగ్రఫీ – ఎస్. వెంకటేష్
మ్యూజిక్ – జిబ్రాన్ వైభోద
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్
స్టోరీ, డైరెక్షన్ – ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News