దక్షిణ భారత సాంస్కృతి సంప్రదాయం, సృజనాత్మకత కలగలిపిన కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ తన తాజా క్యాంపెయిన్ లాంచ్ చేసింది. ఈ కొత్త క్యాంపెయిన్ లో ఆభరణాల అందానికి జీవం పోసిన జాన్వి స్వరూప్ ఘట్టమనేని తన ఫస్ట్ ఆన్-స్క్రీన్ ప్రజెన్స్ తో అందరిని ఆకట్టుకుంది.
నటి–దర్శకురాలు మంజుల ఘట్టమనేని కుమార్తెగా, సూపర్ స్టార్ కృష్ణ గారి మనవరాలిగా జాన్వి కళాత్మక వారసత్వానికి ప్రతీక. ఆత్మవిశ్వాసంతో, అభిరుచితో, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆమె ప్రజెన్స్ ప్రత్యేకంగా నిలిచింది.
బ్రాండ్ క్రియేటివ్ టీమ్ మొదట జాన్వి ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన వెంటనే మెస్మరైజ్ అయ్యారు.
కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కునాల్ మాట్లాడుతూ.. జాన్వి లో ఒక క్లాసిక్ టచ్, డిజైన్ చేయలేని ఒక అరుదైన బ్యూటీ ,అథెంటిసిటీ వుంది. ఆమెను మొదటిసారి పరిచయం చేసే గౌరవం మాకు దక్కడం ఆనందంగా ఉంది. ఇది డెస్టినీ మాకే అప్పగించిన అవకాశంలాగా అనిపించింది. జాన్వి మా బ్రాండ్ విలువలన్నింటినీ ప్రతిబింబిస్తుంది.”
సినిమాటిక్ స్టయిల్ లో అద్భుతంగా తెరకెక్కిన ఈ యాడ్ ఫిలింలో జాన్వి, కౌశిక్ ఆభరణాలతో మెరిసిపోతుంది. ప్రతి ఆభరణం ఒక కథ చెబుతుంది, ప్రతి ఫ్రేమ్ భావోద్వేగంతో వెలుగుతుంది. బ్రైడల్, డైమండ్ కలెక్షన్లలో ఆమె అలంకరించుకున్న తీరు కెమెరా కోసం పుట్టిన స్టార్ లా సహజమైన సొగసుతో ఆకట్టుకుంది.
ఈ ఫిలిం కేవలం ఆభరణాల గురించి మాత్రమే కాదు.. భావోద్వేగాల గురించి కూడా. ఒక మహిళ తనను తాను ఆభరణాలతో కాకుండా, ఆత్మవిశ్వాసంతో అలంకరించుకునే ఆ క్షణాన్ని ఇది ప్రజెంట్ చేస్తోంది. అద్భుతమైనరంగులు, శాశ్వతమైన స్వరాలు, గ్రేట్ విజువల్స్ ద్వారా ఈ క్యాంపెయిన్ నిజమైన అందం మనసులోంచే వెలుగుతుందనే కౌశిక్ ఫిలాసఫీని ప్రతిబింబిస్తుంది.
యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్.ఎల్.ఎన్. రాజేష్ మాట్లాడుతూ.. ఈ యాడ్ ఫిల్మ్ కవితలా అనిపించింది. జాన్వి ఆ కవిత్వానికి జీవం పోసింది. ఆమె నటించదు.. ఆ పాత్రగా మారిపోతుంది. ఆమె ప్రజెన్స్ సెట్లో ఒక ప్రశాంతమైన శక్తిని, ప్రకాశాన్ని నింపింది.
ఈ కొలాబరేషన్ శుద్ధత, నాణ్యతలపై నిర్మితమైన కౌశిక్ గోల్డ్ అండ్ డైమండ్స్ , కళ, హృదయంతో రూపుదిద్దుకున్న ఘట్టమనేని కుటుంబం.. రెండు చిరస్థాయి వారసత్వాల కలయికకు గుర్తుగా నిలిచింది.
కౌశిక్ గోల్డ్ ఎప్పుడూ తెలుగు నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది, జాన్వి అందం, విలువలతో నిలిచి ఈ జనరేషన్ బెస్ట్ ని ప్రతిబింబిస్తుంది అని ఈ ప్రాజెక్ట్తో అనుబంధమైన సీనియర్ బ్రాండ్ కన్సల్టెంట్ తెలిపారు.
జాన్వి కోసం ఈకాంపైయన్ వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. జాన్వి మాట్లాడుతూ.. “ఈ సహకారం నాకు చాలా ప్రత్యేకం. కౌశిక్ జ్యువెలరీలో ఒక సొంతదనం, ఒక ఆత్మీయత ఉంది. వారి డిజైన్లు సంప్రదాయాన్ని, ఆధునికతను ప్రతిబింబిస్తాయి.
జాన్వి తల్లి మంజుల ఘట్టమనేని, తన కుమార్తె సినిమా, గ్లామర్ ప్రపంచంలో మొదటి అడుగు వేస్తున్న క్షణాన్ని చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక అద్భుతమైన క్షణం. కౌశిక్ గోల్డ్ ఆమె అందాన్ని, ఆత్మను అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఇంత అందంగా, అంతరంగానికి దగ్గరగా ఉండే ప్రాజెక్ట్లో ఆమె కనిపించిన తీరు చూసి ఒక తల్లి కల మరోసారి సాకారమైనట్టుంది.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…