క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న థ్రిల్లర్ మూవీ “కోడి బుర్ర”

Must Read

హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా “కోడి బుర్ర”. అల్లుకున్న కథ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్ బ్యానర్ లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోడి బుర్ర సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరిస్తున్నారు. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మూవీ టీమ్ చెబుతున్నారు. త్వరలోనే “కోడి బుర్ర” చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా

దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ – ముందుగా ప్రేక్షకులందరికి దసరా శుభాకాంక్షలు. మా “కోడి బుర్ర” అల్లుకున్న కథ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నాం. భారీ క్లైమాక్స్ సన్నివేశాలు రూపొందిస్తున్నాం. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ మూవీకి ఆకర్షణగా నిలవనుంది. హీరో శ్రీరామ్ గారు, మా ప్రొడ్యూసర్స్, ఇతర టీమ్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. సినిమాను మంచి క్వాలిటీతో కంప్లీట్ చేసి త్వరలోనే మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా తీసుకొస్తాం. అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – తెలుగు ఆడియెన్స్ కు దసరా శుభాకాంక్షలు. “కోడి బుర్ర” సినిమాలో హీరోగా నటిస్తుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం మా మూవీ క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తున్నారు. చాలా ఫాస్ట్ గా మూవీ షూటింగ్ చేస్తున్నాం. మా మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. కథలో ఎన్నో మలుపులు ఉంటాయి. వాటిని ఇప్పుడే రివీల్ చేస్తే మీకు థ్రిల్ పోతుంది. అందుకే థియేటర్ లోనే “కోడి బుర్ర” సినిమాను చూడండి. ఈ రోజు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వచ్చే మూవీస్ సక్సెస్ అవుతున్నాయి. “కోడి బుర్ర” సినిమా కథ మీ చుట్టూ జరుగుతున్నట్లే ఉంటుంది. చాలా రియలిస్టిక్ మూవీ ఇది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నాకు ఈ మూవీ చేసే ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరోయిన్ ఆరుషి మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమాలో కీ రోల్ చేస్తున్నాను. మా హీరో శ్రీరామ్ గారు ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెబుతున్నా. “కోడి బుర్ర” అల్లుకున్న కథ ఒక మంచి థ్రిల్లర్ మూవీగా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు

నిర్మాత వట్టం రాఘవేంద్ర మాట్లాడుతూ”వి4 క్రియేషన్ బ్యానర్ లో మేము నలుగురం కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ ఇది. కోడిబుర్ర అనేది మంచి క్యాచి టైటిల్. ఈ చిత్రంలో శ్రీరాం గారు కీరోల్ పోషిస్తుండటం ఆనందంగా ఉంది.అలాగే ఆనంద్ గారు, రాంప్రసాద్, జెమినీ సురేష్ వంటి వారు నటిస్తుండటంసంతోషంగా ఉంది. ప్రస్తుతం మంచి యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నాం. ఈ సినిమాను చాలా రిచ్ గా తెర కెక్కిస్తున్నాం. డెఫినెట్ గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నారు

నిర్మాత గట్టు విజయ్ మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమా సెకండ్ షెడ్యూల్ చేస్తున్నాం. మా డైెరెక్టర్ గారి ప్లానింగ్ తో చాలా త్వరగా మూవీ కంప్లీట్ చేస్తున్నాం. ఈ రోజు క్లైమాక్స్ సీన్స్ భారీగా జరుగుతున్నాయి. ఫైటర్స్, స్టంట్ మాస్టర్స్ క్లైమాక్స్ ను అద్భుతంగా రూపొందిస్తున్నారు. మా హీరో శ్రీరామ్ గారికి థ్యాంక్స్. ఆయన ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అన్నారు.

నిర్మాత కంచర్ల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమా టీమ్ తరుపున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మా మూవీ సెకండ్ షెడ్యూల్ లో క్లైమాక్స్ భారీ ఎత్తున రూపొందిస్తున్నాం. నా ఫేవరేట్ హీరో శ్రీరామ్ గారితో సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని నా మిత్రులు గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాను. మా సంస్థలో మరిన్ని మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాం. “కోడి బుర్ర” చిత్రాన్ని త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తున్నాం. అన్నారు.

నటుడు ఆనంద్ మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమాలో ఓ మంచి రోల్ చేస్తున్నాను. థ్రిల్లర్ సినిమాల్లో కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ చేస్తున్నారు డైరెక్టర్ చంద్రశేఖర్ గారు. శ్రీరామ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఒక మంచి చిత్రంతో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాం. అన్నారు.

కమెడియన్ జబర్దస్త్ రాంప్రసాద్ మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమాలో నేను కామెడీ చేయను. నాతో శ్రీరామ్ గారు కామెడీ చేయిస్తారు. మంచి థ్రిల్లింగ్ ఇచ్చే సినిమా ఉంది. ట్విస్ట్స్, టర్న్స్ ఆకట్టుకుంటాయి. శ్రీరామ్ గారితో ఈ సినిమాలో నటించడం ఎంతో హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ సినిమా మేకింగ్ పట్ల ప్యాషన్ ఉన్నవారు. వారికి “కోడి బుర్ర” అల్లుకున్న కథ చిత్రంతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – శ్రీరామ్, శృతి మీనన్, ఆరుషి, ఆనంద్, జెమిని సురేష్,జబర్దస్త్ రాంప్రసాద్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ – గ్యారి .B H
సినిమాటోగ్రఫీ – కళ్యాణ్ శ్యామ్
మ్యూజిక్ – సుకుమార్ రాగ
పీఆర్ఓ – వీరబాబు బాసింశెట్టి
బ్యానర్ – వీ4 క్రియేషన్స్
నిర్మాతలు – కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్
రచన, దర్శకత్వం – చంద్రశేఖర్ కానూరి

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News