‘ఒకే ఒక జీవితం’, ‘సుల్తాన్’, ‘ఖైదీ’, ‘ఖాకీ’ వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాల అందించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెలుగు-తమిళ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు గణేష్రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ఫిమేల్ ఒరింయంటెడ్ కథ ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు, టర్న్లు, అత్యుత్తమ సాంకేతికతతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వనుంది. కీర్తి సురేష్ సరికొత్త పాత్రలో ప్రేక్షకులు, అభిమానులని అలరించనున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు చెన్నైలో గ్రాండ్ గా జరిగాయి. కీర్తి సురేష్, నిర్మాతలు ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, దర్శకుడు గణేష్ రాజ్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మాధేష్ మాణికం సినిమాటోగ్రాఫర్ కాగా, జెవి మణికంద బాలాజీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ శక్తీ వెంకట్రాజ్, యాక్షన్ డైరెక్టర్ గా పీసీ స్టంట్స్ పని చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత ఎస్ఆర్ప్రబు మాట్లాడుతూ.. “ఈ చిత్రం థ్రిల్లింగ్ కథనం, అత్యుత్తమ సాంకేతికతతో సరికొత్త అనుభూతిని ఇస్తూ అందరినీ అలరిస్తుంది” అన్నారు.
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…