‘ఒకే ఒక జీవితం’, ‘సుల్తాన్’, ‘ఖైదీ’, ‘ఖాకీ’ వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాల అందించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెలుగు-తమిళ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు గణేష్రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ఫిమేల్ ఒరింయంటెడ్ కథ ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు, టర్న్లు, అత్యుత్తమ సాంకేతికతతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వనుంది. కీర్తి సురేష్ సరికొత్త పాత్రలో ప్రేక్షకులు, అభిమానులని అలరించనున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు చెన్నైలో గ్రాండ్ గా జరిగాయి. కీర్తి సురేష్, నిర్మాతలు ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, దర్శకుడు గణేష్ రాజ్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మాధేష్ మాణికం సినిమాటోగ్రాఫర్ కాగా, జెవి మణికంద బాలాజీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ శక్తీ వెంకట్రాజ్, యాక్షన్ డైరెక్టర్ గా పీసీ స్టంట్స్ పని చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత ఎస్ఆర్ప్రబు మాట్లాడుతూ.. “ఈ చిత్రం థ్రిల్లింగ్ కథనం, అత్యుత్తమ సాంకేతికతతో సరికొత్త అనుభూతిని ఇస్తూ అందరినీ అలరిస్తుంది” అన్నారు.
ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన"కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్…
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు…
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…