‘ఒకే ఒక జీవితం’, ‘సుల్తాన్’, ‘ఖైదీ’, ‘ఖాకీ’ వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాల అందించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెలుగు-తమిళ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు గణేష్రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ఫిమేల్ ఒరింయంటెడ్ కథ ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు, టర్న్లు, అత్యుత్తమ సాంకేతికతతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వనుంది. కీర్తి సురేష్ సరికొత్త పాత్రలో ప్రేక్షకులు, అభిమానులని అలరించనున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు చెన్నైలో గ్రాండ్ గా జరిగాయి. కీర్తి సురేష్, నిర్మాతలు ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, దర్శకుడు గణేష్ రాజ్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మాధేష్ మాణికం సినిమాటోగ్రాఫర్ కాగా, జెవి మణికంద బాలాజీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ శక్తీ వెంకట్రాజ్, యాక్షన్ డైరెక్టర్ గా పీసీ స్టంట్స్ పని చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత ఎస్ఆర్ప్రబు మాట్లాడుతూ.. “ఈ చిత్రం థ్రిల్లింగ్ కథనం, అత్యుత్తమ సాంకేతికతతో సరికొత్త అనుభూతిని ఇస్తూ అందరినీ అలరిస్తుంది” అన్నారు.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని.…
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్ను ఎస్ కే…
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…