భువనేశ్వరి పిక్చర్స్ కన్నడ- తెలుగు బైలింగ్వల్ మూవీ అనౌన్స్‌మెంట్

Must Read

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ “హ్యాట్రిక్ హీరో”, కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ సౌత్ ఇండియాలో బిజియస్ట్ యాక్టర్స్ లో ఒకరు, లీడ్ రోల్స్ తో పాటు, జైలర్, కెప్టెన్ మిల్లర్. ఇతర ప్రముఖ చిత్రాలలో ప్రత్యేక పాత్రలు చేయడంలో శివన్న పాపులర్.

నిన్న శ్రీమతి గీతా శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా శివ రాజ్‌కుమార్ నెక్స్ట్ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ కన్నడ తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్ ని  కార్తీక్ అద్వైత్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ పి నిర్మిస్తున్నారు.

మేకర్స్ కొత్తగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా శ్రీమతి గీతా శివ రాజ్‌కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, అనౌన్స్ మెంట్ కి పర్శనల్ టచ్ జోడించి, ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఎక్సయిట్మెంట్ ని పెంచడం ద్వారా మూవీని అనౌన్స్ చేశారు.

కార్తీక్ అద్వైత్ గతంలో విక్రమ్ ప్రభుతో ‘పాయుమ్ ఒలి నీ యెనక్కు’ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ ప్రాజెక్ట్‌తో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టారు, ఇది అతని సెకెండ్  డైరెక్షనల్ వెంచర్‌.

శివరాజ్ కుమార్‌ని కంప్లీట్ కొత్త లుక్, క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసే ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది, ఇప్పటికే మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతోంది. అఫీషియల్ లాంచ్ వేడుక ఆగస్ట్‌లో వుంటుంది, షూట్‌ను ఫార్మల్ గా కిక్ స్టార్ట్ చేశారు.  

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నిర్మాత ఎస్ ఎన్ రెడ్డి ఈ బైలింగ్వల్ వెంచర్ కోసం సుధీర్ పి.తో కొలబరేట్ అవుతున్నారు. SN రెడ్డి రీసెంట్ ప్రాజెక్ట్ “జీబ్రా,” తెలుగు, కన్నడ రెండింటిలోనూ విడుదల కానుంది.

మిగిలిన ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక ఖరారైంది, శివరాజ్ కుమార్ నటనకు అనుగుణంగా ట్యాలెంటెడ్ స్టార్ కాస్ట్ వుంటుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్స్ త్వరలో రిలీజ్ అవుతాయి. ఈ చిత్రం హై-బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎ.జె శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ దీపు ఎస్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ రవి సంతే హక్లే.

ఈ కన్నడ – తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

నటీనటులు: కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కార్తీక్ అద్వైత్
నిర్మాతలు: SN రెడ్డి,  సుధీర్ P
బ్యానర్: భువనేశ్వరి పిక్చర్స్
సమర్పణ: పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
సంగీతం: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: ఎ.జె. శెట్టి
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: రవి సంతే హక్లే
పీఆర్వో: వంశీ శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News